గాజా, లెబనాన్లలో యుద్ధం.. ముగింపు కోసం ఖతార్ కృషి..!!
- October 25, 2024
దోహా: గాజా, లెబనాన్లలో యుద్ధం కారణంగా తలెత్తిన బాధాకరమైన దశను వీలైనంత త్వరగా ముగించాల్సిన అవసరం ఉందని, అమాయక పౌరుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఖతార్ ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి HE షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ కోరారు.
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్తో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కొన్ని రోజులుగా గాజాపై ముఖ్యంగా ఉత్తర ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడులు తీవ్రమవుతున్నాయని అన్నారు. ఉత్తర గాజాపై విధించిన ఆంక్షలు, ఆసుపత్రులు, శరణార్థి శిబిరాలపై బాంబు దాడులు, గాజా స్ట్రిప్లోని పాలస్తీనియన్లపై బారెల్ బాంబులు వేయడం వరకు తీవ్రస్థాయికి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి ఖతార్ విధానం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు. గాజా, లెబనాన్లలో యుద్ధాలను ఆపడానికి.. ఈ ప్రాంతంలో సమగ్ర కాల్పుల విరమణను సాధించడానికి ఖతార్ రాష్ట్రం కృషి చేస్తోందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









