గాజా, లెబనాన్లలో యుద్ధం.. ముగింపు కోసం ఖతార్ కృషి..!!
- October 25, 2024
దోహా: గాజా, లెబనాన్లలో యుద్ధం కారణంగా తలెత్తిన బాధాకరమైన దశను వీలైనంత త్వరగా ముగించాల్సిన అవసరం ఉందని, అమాయక పౌరుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఖతార్ ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి HE షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ కోరారు.
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్తో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కొన్ని రోజులుగా గాజాపై ముఖ్యంగా ఉత్తర ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడులు తీవ్రమవుతున్నాయని అన్నారు. ఉత్తర గాజాపై విధించిన ఆంక్షలు, ఆసుపత్రులు, శరణార్థి శిబిరాలపై బాంబు దాడులు, గాజా స్ట్రిప్లోని పాలస్తీనియన్లపై బారెల్ బాంబులు వేయడం వరకు తీవ్రస్థాయికి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి ఖతార్ విధానం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు. గాజా, లెబనాన్లలో యుద్ధాలను ఆపడానికి.. ఈ ప్రాంతంలో సమగ్ర కాల్పుల విరమణను సాధించడానికి ఖతార్ రాష్ట్రం కృషి చేస్తోందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి









