హైదరాబాద్: నకిలీ ఐఫోన్లు అమ్ముతున్న నలుగురు అరెస్ట్
- October 26, 2024
హైదరాబాద్: చైనా ఫోన్లకు స్టిక్కర్లు వేసి ఐఫోన్లుగా అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్లో అబిడ్స్ జగదీష్ మార్కెట్లో నకిలీ ఐఫోన్లు అమ్ముతున్న నలుగురు నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జగదీష్ మార్కెట్లో చైనా ఫోన్లకు ఐఫోన్ స్టిక్కర్లు వేసి అమ్ముతున్నారన్న సమాచారంతో శుక్రవారం పోలీసులు మొబైల్ షాప్స్ మీద రైడ్ చేశారు. ఇందులో రూ.3 కోట్ల విలువైన నకిలీ ఐఫోన్ పరికరాలను చేసుకున్న పోలీసులు.. స్టిక్కర్లు మార్చి ఐఫోన్లుగా అమ్ముతున్న దుకాణాలను సీజ్ చేసి.. నిందితులను అరెస్ట్ చేశారు. గత కొన్ని నెలలుగా నిందితులు మోసానికి పాల్పడి అమాయకుల నుండి కోట్ల రూపాయలు దోచుకున్నట్టు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







