అల్ వాత్బా రిజర్వ్ లోకి చొరబాటు.. నిందితులకు Dh165,000 జరిమానా..!!
- October 26, 2024
యూఏఈ: అబుదాబిలో అనేక మంది వ్యక్తులు ప్రకృతి రిజర్వ్లోకి ప్రవేశించి, జంతువుల ఆవాసాలను దెబ్బతీసినందుకు Dh165,000 జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ అబుదాబి (EAD) అల్ వత్బాలోని రక్షిత ప్రాంతాలలో ఒకదానిలో ఉల్లంఘనను గుర్తించినట్లు తెలిపింది. ఈ వ్యక్తులు అనుమతి లేకుండా అభయారణ్యంలోకి ప్రవేశించినట్లు వెల్లడించారు. అల్ వత్బా అనేది ఎమిరేట్ కొన్ని విలువైన సహజ సంపదలకు నిలయంగా ఉన్నది. అల్ వాత్బా వెట్ల్యాండ్ రిజర్వ్ వేసవిలో వేలాది ఫ్లెమింగోలకు ఆతిథ్యం ఇస్తుంది. ఈ ప్రాంతంలో శాశ్వతంగా నివసించే అనేక జాతులతో పాటు.. ఈ రక్షిత ప్రాంతంలో సుమారు 120,000 సంవత్సరాల క్రితం నుండి శిలాజ సంపద ఉన్నట్లు గుర్తించారు. మనమందరం పర్యావరణ చట్టాలకు కట్టుబడి ఉండాలని, భవిష్యత్ తరాలకు మన సహజ వనరులను అందించేందుకు ముందుకు రావాలని, మెరుగైన పర్యావరణం కోసం పని చేయాలని EAD పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు







