మనాహ్లో ఒమానీ యువజన దినోత్సవ వేడుకలు..!!
- October 26, 2024
మస్కట్: ఒమన్ సుల్తానేట్ ప్రతి సంవత్సరం అక్టోబర్ 26న ఒమానీ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అల్ దఖిలియా గవర్నరేట్లోని మనాహ్లోని ఒమన్ అక్రాస్ ఏజ్ మ్యూజియంలో ఈ సందర్భంగా జరగనున్న వేడుకలకు సాంస్కృతిక, క్రీడలు, యువజన శాఖ మంత్రి హిస్ హైనెస్ సయ్యద్ థెయాజిన్ బిన్ హైతం అల్ సయీద్ హాజరవుతారు. ఈ వేడుకలో 2024 సంవత్సరానికి యూత్ ఎక్సలెన్స్ అవార్డు విజేతలను ప్రకటించనున్నారు. ఒమానీ యువతలో నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ లక్ష్యమని అధికార యంత్రాంగం పేర్కొంది. యూత్ సెంటర్ విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి 110,361 వేల మంది ప్రయోజనం పొందారు. ఇందులో 101,600 వేల మంది యువకులు ఉన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల