ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు.. టెహ్రాన్లో పేలుళ్లు..!!
- October 26, 2024
టెహ్రాన్: ఇరాన్లోని సైనిక లక్ష్యాలపై తమ సైన్యం "ఖచ్చితమైన దాడులను" అమలు చేసిందని ఇజ్రాయెల్ శనివారం తెల్లవారుజామున ప్రకటించింది. టెహ్రాన్లో పేలుళ్లు వినిపించాయని స్థానికులు కూడా సోషల్ మీడియా అకౌంట్లలో వెల్లడించారు. "ప్రస్తుతం, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇరాన్లోని సైనిక లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు నిర్వహిస్తోంది" అని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి రియర్ అడ్మ్ డానియల్ హగారి తెలిపారు.
ఇజ్రాయెల్ ఆర్మీ రేడియో ప్రకారం.. అనేక ఇజ్రాయెల్ విమానాలు టెహ్రాన్, మషాద్, కరాజ్లోని పవర్ స్టేషన్తో సహా వివిధ ప్రదేశాలపై దాడులకు పాల్పడ్డాయి. ఇరాన్ రాజధానిలో పేలుళ్లు విన్నట్లు ఇరాన్ సెమీ-అధికారిక ఫార్స్ న్యూస్ ఏజెన్సీ నివేదించగా, సిరియన్ వార్తా సంస్థ సనా డమాస్కస్లో పేలుళ్లకు సంబంధించిన ఇలాంటి నివేదికలను ధృవీకరించింది.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







