కీలక ఉద్యోగాలు బహ్రెయిన్లతో భర్తీ.. ప్రతిపాదించిన ఎంపీలు..!!
- October 26, 2024
మనామా: ఇంజనీర్లు, అకౌంటెంట్లు తదితర కీలక ఉద్యోగాల్లో ప్రవాసుల స్థానంలో బహ్రెయిన్ వాసులను నియమించాలని ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. కీలక ఉద్యోగాలను స్థానికీకరించాలని కోరుతూ ఎంపి మహ్మద్ జాసిమ్ ఒలైవి ప్రతిపాదన చేశారు. బహ్రెయిన్ పౌరులకు అవసరమైన అర్హతలు ఉన్న స్థానిక గ్రాడ్యుయేట్లతో భర్తీ చేయడం ద్వారా ఉద్యోగ విఫణిలో స్థిరమైన పట్టును కల్పించాలని కోరారు. బహ్రెయిన్ రాజ్యాంగం పౌరులకు పని చేసే హక్కుకు హామీ ఇస్తుంది. ఈ ప్రతిపాదన రాజ్యాంగంలోని ఆర్టికల్ 68లోని నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. కౌన్సిల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంతర్గత నిబంధనలలోని ఆర్టికల్ 127, 128 ప్రకారం.. ప్రతిపాదనపై చర్చించాలని ఎంపీలు డిమాండ్ చేశారు. బహ్రెయిన్ల భవిష్యత్తు అవకాశాలను ప్రమాదంలో పడేస్తున్నారని ఎంపీలు హెచ్చరించారు. ప్రవాసుల ఉపాధిపై పెరుగుతున్న ఆందోళనను పరిష్కరించడానికి తక్షణ చర్య తీసుకోవాలని కోరారు. ఈ ప్రతిపాదనకు ఎంపీలు జలీలా అల్ సయ్యద్, అబ్దుల్వాహిద్ ఖరాతా, అబ్దుల్నబీ సల్మాన్, లుల్వా అల్ రుమైహి మద్దతు ఇచ్చారు. ఈ ప్రతిపాదన ఆమోదం పొందినట్లయితే, ఇది బహ్రెయిన్ లేబర్ మార్కెట్లో గణనీయమైన పరివర్తనను తెచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







