కీలక ఉద్యోగాలు బహ్రెయిన్లతో భర్తీ.. ప్రతిపాదించిన ఎంపీలు..!!
- October 26, 2024
మనామా: ఇంజనీర్లు, అకౌంటెంట్లు తదితర కీలక ఉద్యోగాల్లో ప్రవాసుల స్థానంలో బహ్రెయిన్ వాసులను నియమించాలని ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. కీలక ఉద్యోగాలను స్థానికీకరించాలని కోరుతూ ఎంపి మహ్మద్ జాసిమ్ ఒలైవి ప్రతిపాదన చేశారు. బహ్రెయిన్ పౌరులకు అవసరమైన అర్హతలు ఉన్న స్థానిక గ్రాడ్యుయేట్లతో భర్తీ చేయడం ద్వారా ఉద్యోగ విఫణిలో స్థిరమైన పట్టును కల్పించాలని కోరారు. బహ్రెయిన్ రాజ్యాంగం పౌరులకు పని చేసే హక్కుకు హామీ ఇస్తుంది. ఈ ప్రతిపాదన రాజ్యాంగంలోని ఆర్టికల్ 68లోని నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. కౌన్సిల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంతర్గత నిబంధనలలోని ఆర్టికల్ 127, 128 ప్రకారం.. ప్రతిపాదనపై చర్చించాలని ఎంపీలు డిమాండ్ చేశారు. బహ్రెయిన్ల భవిష్యత్తు అవకాశాలను ప్రమాదంలో పడేస్తున్నారని ఎంపీలు హెచ్చరించారు. ప్రవాసుల ఉపాధిపై పెరుగుతున్న ఆందోళనను పరిష్కరించడానికి తక్షణ చర్య తీసుకోవాలని కోరారు. ఈ ప్రతిపాదనకు ఎంపీలు జలీలా అల్ సయ్యద్, అబ్దుల్వాహిద్ ఖరాతా, అబ్దుల్నబీ సల్మాన్, లుల్వా అల్ రుమైహి మద్దతు ఇచ్చారు. ఈ ప్రతిపాదన ఆమోదం పొందినట్లయితే, ఇది బహ్రెయిన్ లేబర్ మార్కెట్లో గణనీయమైన పరివర్తనను తెచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు







