కీలక ఉద్యోగాలు బహ్రెయిన్లతో భర్తీ.. ప్రతిపాదించిన ఎంపీలు..!!
- October 26, 2024
మనామా: ఇంజనీర్లు, అకౌంటెంట్లు తదితర కీలక ఉద్యోగాల్లో ప్రవాసుల స్థానంలో బహ్రెయిన్ వాసులను నియమించాలని ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. కీలక ఉద్యోగాలను స్థానికీకరించాలని కోరుతూ ఎంపి మహ్మద్ జాసిమ్ ఒలైవి ప్రతిపాదన చేశారు. బహ్రెయిన్ పౌరులకు అవసరమైన అర్హతలు ఉన్న స్థానిక గ్రాడ్యుయేట్లతో భర్తీ చేయడం ద్వారా ఉద్యోగ విఫణిలో స్థిరమైన పట్టును కల్పించాలని కోరారు. బహ్రెయిన్ రాజ్యాంగం పౌరులకు పని చేసే హక్కుకు హామీ ఇస్తుంది. ఈ ప్రతిపాదన రాజ్యాంగంలోని ఆర్టికల్ 68లోని నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. కౌన్సిల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంతర్గత నిబంధనలలోని ఆర్టికల్ 127, 128 ప్రకారం.. ప్రతిపాదనపై చర్చించాలని ఎంపీలు డిమాండ్ చేశారు. బహ్రెయిన్ల భవిష్యత్తు అవకాశాలను ప్రమాదంలో పడేస్తున్నారని ఎంపీలు హెచ్చరించారు. ప్రవాసుల ఉపాధిపై పెరుగుతున్న ఆందోళనను పరిష్కరించడానికి తక్షణ చర్య తీసుకోవాలని కోరారు. ఈ ప్రతిపాదనకు ఎంపీలు జలీలా అల్ సయ్యద్, అబ్దుల్వాహిద్ ఖరాతా, అబ్దుల్నబీ సల్మాన్, లుల్వా అల్ రుమైహి మద్దతు ఇచ్చారు. ఈ ప్రతిపాదన ఆమోదం పొందినట్లయితే, ఇది బహ్రెయిన్ లేబర్ మార్కెట్లో గణనీయమైన పరివర్తనను తెచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









