మడగాస్కర్లో బందిపోట్లు దుశ్చర్య..
- June 23, 2016
మడగాస్కర్లో బందిపోట్లు దుశ్చర్యకు పాల్పడ్డారు. దారిదోపిడి కోసం ఓ వాహనాన్ని అడ్డుకుని.. అందులోని ప్రయాణికులను దారుణంగా చంపేశారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
32 మంది ప్రయాణికులతో టొలియారా నుంచి బెరోరోహా వెళ్తున్న ఓ ప్రైవేట్ టాక్సీని బందిపోట్లు అడ్డుకున్నారు. దీంతో వాహనాన్ని వారి నుంచి తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించగా.. బందిపోట్లు టాక్సీ టైర్లను తుపాకీతో పేల్చారు. అనంతరం వాహనంలోకి చొరబడి ప్రయాణికులపై కాల్పులు జరిపారు. ప్రయాణికుల్లో 10 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బందిపోట్ల దాడిలో 31 మంది ప్రాణాలు కోల్పోగా ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డాడు.
అనంతరం ప్రయాణికుల బ్యాగులు, జేబుల నుంచి దాదాపు 2వేల డాలర్ల నగదును దోచుకుని బందిపోట్లు పరారైనట్లు తెలిపారు. ఈ ఘటనకు కొద్ది గంటల ముందు ఓ మిలిటరీ వాహనంపై కూడా బందిపోట్లు దాడిచేసినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







