మడగాస్కర్లో బందిపోట్లు దుశ్చర్య..
- June 23, 2016
మడగాస్కర్లో బందిపోట్లు దుశ్చర్యకు పాల్పడ్డారు. దారిదోపిడి కోసం ఓ వాహనాన్ని అడ్డుకుని.. అందులోని ప్రయాణికులను దారుణంగా చంపేశారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
32 మంది ప్రయాణికులతో టొలియారా నుంచి బెరోరోహా వెళ్తున్న ఓ ప్రైవేట్ టాక్సీని బందిపోట్లు అడ్డుకున్నారు. దీంతో వాహనాన్ని వారి నుంచి తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించగా.. బందిపోట్లు టాక్సీ టైర్లను తుపాకీతో పేల్చారు. అనంతరం వాహనంలోకి చొరబడి ప్రయాణికులపై కాల్పులు జరిపారు. ప్రయాణికుల్లో 10 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బందిపోట్ల దాడిలో 31 మంది ప్రాణాలు కోల్పోగా ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డాడు.
అనంతరం ప్రయాణికుల బ్యాగులు, జేబుల నుంచి దాదాపు 2వేల డాలర్ల నగదును దోచుకుని బందిపోట్లు పరారైనట్లు తెలిపారు. ఈ ఘటనకు కొద్ది గంటల ముందు ఓ మిలిటరీ వాహనంపై కూడా బందిపోట్లు దాడిచేసినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









