'నిర్మల కాన్వెంట్'లో కింగ్ నాగార్జున అతిథి పాత్రలో
- June 23, 2016
సినీ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ తొలిచిత్రం 'నిర్మల కాన్వెంట్'లో కింగ్ నాగార్జున అతిథి పాత్రలో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్లో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్లో ప్రత్యేకంగా వేసిన సెట్లో పాట చిత్రీకరణ జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రోషన్, శ్రేయ శర్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి నాగ కోటేశ్వరరావు దర్శకత్వం వహించారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కుమారుడు రోషన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. .'వూపిరి' చిత్రం తర్వాత నాగార్జున రెండు నెలల విరామం తీసుకుని నిర్మలా కాన్వెంట్ షూటింగ్లో పాల్గొన్నారు.ప్రస్తుతం నాగ్ రాఘవేంద్రరావు దర్శకత్వం వహించనున్న 'ఓ నమో వెంకటేశాయ' చిత్రంలో కథానాయకుడిగా నటించడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 25న ఈ చిత్రం ప్రారంభంకానుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







