'నిర్మల కాన్వెంట్'లో కింగ్ నాగార్జున అతిథి పాత్రలో
- June 23, 2016
సినీ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ తొలిచిత్రం 'నిర్మల కాన్వెంట్'లో కింగ్ నాగార్జున అతిథి పాత్రలో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్లో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్లో ప్రత్యేకంగా వేసిన సెట్లో పాట చిత్రీకరణ జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రోషన్, శ్రేయ శర్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి నాగ కోటేశ్వరరావు దర్శకత్వం వహించారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కుమారుడు రోషన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. .'వూపిరి' చిత్రం తర్వాత నాగార్జున రెండు నెలల విరామం తీసుకుని నిర్మలా కాన్వెంట్ షూటింగ్లో పాల్గొన్నారు.ప్రస్తుతం నాగ్ రాఘవేంద్రరావు దర్శకత్వం వహించనున్న 'ఓ నమో వెంకటేశాయ' చిత్రంలో కథానాయకుడిగా నటించడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 25న ఈ చిత్రం ప్రారంభంకానుంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









