హైదరాబాద్లో నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలు
- October 28, 2024
హైదరాబాద్: హైదరాబాద్లో 144 సెక్షన్ అమలులోకి వచ్చింది. నగరంలో నిన్నటి నుండి (ఈనెల 27)న సాయంత్రం 6 గంటల నుండి వచ్చే నెల 28 వరకు ఆంక్షలు ఉంటాయని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. నగరంలో సమావేశాలు, ర్యాలీలకు అనుమతి ఇవ్వబడబోదు. అనుమతులు లేకుండా నిర్వహించే ర్యాలీలు, సమావేశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సభ్యుల సంఖ్య ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే సమావేశాలు, ర్యాలీలపై ఆంక్షలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నాడు. ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలను పరామర్శించమని అన్నారు.
బీఎన్ఏస్ఎస్ 2023లోని సెక్షన్ 163 కింద ఈ ఉత్తర్వులు జారీ చేయబడినాయి. అయితే, ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద శాంతియుత నిరసనలు, ధర్నాలకు అనుమతి ఇచ్చినట్టు స్పష్టం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో నిరసన కార్యక్రమాలను నిషేధించారు.
తాజా వార్తలు
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!







