యూఏఈలో దీపావళి.. కొన్ని పాఠశాలల్లో 5 రోజులపాలు సెలవులు..!!
- October 29, 2024
యూఏఈ: ఎమిరేట్స్ లో దీపావళి వేడుకలను పురస్కరించుకొని అనేక భారతీయ స్కూల్స్ సెలవులు ప్రకటించాయి. కొన్ని స్కూల్స్ ఐదు రోజులపాటు సెలవులు ప్రకటించాయి. దక్షిణాసియాలో అతిపెద్ద పండుగలలో ఒకటైన దీపావళిని జరుపుకునేందుకు యూఏఈలోని కొన్ని పాఠశాలలు గురువారం, శుక్రవారం సెలవులు ప్రకటించాయి. వీకెండ్ శనివారం, ఆదివారంతో కలిపి నాలుగు రోజులపాటు సెలవులు రానున్నాయి. మరికొన్ని పాఠశాలలు బుధవారం రోజున కూడా సెలవు ప్రకటించాయి. ఈ సంవత్సరం దీపావళి ఉత్సవాలు అక్టోబర్ 29 న ధన్తేరస్తో ప్రారంభమవుతాయి. అయితే ప్రధాన దీపావళి వేడుక అక్టోబర్ 31న(గురువారం) జరుగుతుంది. అమిటీ స్కూల్ దుబాయ్లో ప్రిన్సిపాల్ సంగీతా చిమా మాట్లాడుతూ.. ఈ సంవత్సరం దీపావళి సందర్బంగా 5 రోజుల సుదీర్ఘ దీపావళి సెలవులు (అక్టోబర్ 31 నుండి నవంబర్ 4 వరకు) ప్రకటించారని తెలిపారు. అయితే, దుబాయ్లోని సెలవులను ప్రకటించాలంటే..ముందుగా నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (KHDA) తెలిపి ఆమోదించుకోవాలి. షైనింగ్ స్టార్ ఇంటర్నేషనల్ ప్రిన్సిపాల్ అభిలాషా సింగ్ మాట్లాడుతూ.. అక్టోబర్ 31, నవంబర్ 1న దీపావళి సెలవులు ప్రకటించినట్టు తెలిపారు. స్టూడెంట్స్ లాంగ్ వీకెండ్ని పొందుతున్నారు. అక్టోబరు 30న రంగోలీ పోటీని ప్లాన్ చేసామని, తర్వాత ఖమాన్ ధోక్లా, గులాబ్ జామూన్, సమోసా వంటి కొన్ని భారతీయ స్నాక్స్ తో సంబరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా, గాజా, లెబనాన్లో నెలకొన్న సంక్షోభాల కారణంగా ఈ సారి పరిమితంగానే దీపావళి వేడుకలను పరిమితంగానే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









