యూఏఈలో దీపావళి.. కొన్ని పాఠశాలల్లో 5 రోజులపాలు సెలవులు..!!
- October 29, 2024
యూఏఈ: ఎమిరేట్స్ లో దీపావళి వేడుకలను పురస్కరించుకొని అనేక భారతీయ స్కూల్స్ సెలవులు ప్రకటించాయి. కొన్ని స్కూల్స్ ఐదు రోజులపాటు సెలవులు ప్రకటించాయి. దక్షిణాసియాలో అతిపెద్ద పండుగలలో ఒకటైన దీపావళిని జరుపుకునేందుకు యూఏఈలోని కొన్ని పాఠశాలలు గురువారం, శుక్రవారం సెలవులు ప్రకటించాయి. వీకెండ్ శనివారం, ఆదివారంతో కలిపి నాలుగు రోజులపాటు సెలవులు రానున్నాయి. మరికొన్ని పాఠశాలలు బుధవారం రోజున కూడా సెలవు ప్రకటించాయి. ఈ సంవత్సరం దీపావళి ఉత్సవాలు అక్టోబర్ 29 న ధన్తేరస్తో ప్రారంభమవుతాయి. అయితే ప్రధాన దీపావళి వేడుక అక్టోబర్ 31న(గురువారం) జరుగుతుంది. అమిటీ స్కూల్ దుబాయ్లో ప్రిన్సిపాల్ సంగీతా చిమా మాట్లాడుతూ.. ఈ సంవత్సరం దీపావళి సందర్బంగా 5 రోజుల సుదీర్ఘ దీపావళి సెలవులు (అక్టోబర్ 31 నుండి నవంబర్ 4 వరకు) ప్రకటించారని తెలిపారు. అయితే, దుబాయ్లోని సెలవులను ప్రకటించాలంటే..ముందుగా నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (KHDA) తెలిపి ఆమోదించుకోవాలి. షైనింగ్ స్టార్ ఇంటర్నేషనల్ ప్రిన్సిపాల్ అభిలాషా సింగ్ మాట్లాడుతూ.. అక్టోబర్ 31, నవంబర్ 1న దీపావళి సెలవులు ప్రకటించినట్టు తెలిపారు. స్టూడెంట్స్ లాంగ్ వీకెండ్ని పొందుతున్నారు. అక్టోబరు 30న రంగోలీ పోటీని ప్లాన్ చేసామని, తర్వాత ఖమాన్ ధోక్లా, గులాబ్ జామూన్, సమోసా వంటి కొన్ని భారతీయ స్నాక్స్ తో సంబరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా, గాజా, లెబనాన్లో నెలకొన్న సంక్షోభాల కారణంగా ఈ సారి పరిమితంగానే దీపావళి వేడుకలను పరిమితంగానే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









