దుబాయ్ డ్యూటీ ఫ్రీ మాజీ చీఫ్ కోల్మ్ మెక్లౌగ్లిన్ కన్నుమూత
- November 01, 2024
దుబాయ్: దుబాయ్ డ్యూటీ ఫ్రీ (DDF) ప్రారంభానికి నాయకత్వం వహించిన కోల్మ్ మెక్లౌగ్లిన్(81) బుధవారం యూకేలో మరణించారు. మెక్లౌగ్లిన్ 1983లో కొత్త డ్యూటీ ఫ్రీ ఆపరేషన్ను ప్రారంభించేందుకు దుబాయ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఐరిష్ ఎయిర్పోర్ట్ అథారిటీ అయిన ఏర్ రియాంటా కన్సల్టెన్సీ బృందంలో సభ్యుడిగా ఉన్నారు. ట్రావెల్ రిటైల్ పరిశ్రమలో 55 ఏళ్ల తర్వాత డిడిఎఫ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్, సిఇఒగా ఈ ఏడాది మేలో పదవీ విరమణ చేశారు.
దుబాయ్ ఎయిర్పోర్ట్స్ (DXB) గురువారం ఒక ట్వీట్లో సంతాపం తెలిపింది. మెక్లౌగ్లిన్ను "ట్రావెల్ రిటైల్ కమ్యూనిటీలో ఒక విశిష్ట నాయకుడు, ప్రియమైన వ్యక్తి"గా అభివర్ణించింది. Flydubai CEO ఘైత్ అల్ ఘైత్ మాట్లాడుతూ..కాల్మ్ మరణ వార్త బాధించిందని తెలిపారు. అతను గత నాలుగు దశాబ్దాలుగా దుబాయ్ డ్యూటీ ఫ్రీకి అందించిన విశేషమైన సహకారం ట్రావెల్ రిటైల్ ల్యాండ్స్కేప్ను మార్చిందన్నారు. ప్రస్తుతం DDFలో 55 వివిధ దేశాలకు చెందిన 5,700 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. గత సంవత్సరం Dh7.8 బిలియన్ల అమ్మకాలు చేసింది. దాదాపు 21.5 మిలియన్ లావాదేవీలతో 55 మిలియన్ల వస్తువులను విక్రయించింది.
తాజా వార్తలు
- కొత్తగా 3 ఎయిర్పోర్టులు.. నివేదికలు సిద్ధం చేసిన ప్రభుత్వం!
- విశాఖపట్నం విమానాశ్రయంలో సివిల్ విమానాల రాకపోకలు బంద్
- వాట్సాప్లో ఏఐ స్కామ్ అలర్ట్ ఫీచర్..
- ఏపీలో రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్
- వన్డే ప్రపంచకప్ పై ఐసీసీ సంచలన నిర్ణయం!
- 30 ఏళ్లలోనే మెనోపాజ్కు సిద్ధం కావాలి..వైద్యుల సూచన..!!
- నీటిని వృథా చేసే శానిటరీ వస్తువుల వినియోగంపై SR10,000 జరిమానా..!!
- పొరపాటున వేరే వ్యక్తికి డబ్బులు పంపారా?
- భారత్–యూఏఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని IBPC పిలుపు
- ఒమన్ తీరంలో ఆయిల్ కాలుష్యం.. 12 కిలోమీటర్ల మేర ప్రభావం..!!







