దుబాయ్ లో కొత్త ఆర్థిక చట్టాలు..ట్రావెల్ బ్యాన్, ప్రాపర్టీ సీజ్..!!
- November 01, 2024
యూఏఈ: దుబాయ్ లో కొత్త ఆర్థిక చట్టాలను అమల్లోకి తెచ్చారు. వాటిని ఉల్లంఘించిన వారిపై ట్రావెల్ బ్యాన్లు, ఆస్తుల సీజ్ వంటి తీవ్రమైన చర్యలను చేపట్టనున్నారు. ఫైనాన్షియల్ ఆడిట్ అథారిటీ డైరెక్టర్ జనరల్కు దుర్వినియోగాన్ని పరిష్కరించడానికి ఉద్యోగులపై అనేక చర్యలు తీసుకునే అధికారం చట్టం ద్వారా కల్పించారు. ఈ మేరకు అక్టోబర్ 30న కొత్త ఆడిటింగ్ చట్టాలకు సంబంధించి ఉత్తర్వులను దుబాయ్ పాలకుడు, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ జారీ చేశారు. ఫైనాన్షియల్ ఆడిట్ అథారిటీ స్థాపనకు సంబంధించి 2018 లా నెం. (4)లోని కొన్ని నిబంధనలను సవరించారు. అలాగే 2024 లా నంబర్ (24)ని జారీ చేసారు. అసలు చట్టంలోని 34, 35, 36 ఆర్టికల్లను కొత్తగా నిర్వచించారు. చిన్న ఉల్లంఘనలను క్రమశిక్షణా చర్యల ద్వారా పరిష్కరించవచ్చు. అయితే క్రిమినల్ నేరాలను దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్కు నివేదించాలి. ఇంకా ట్రావెల్ బ్యాన్లు, అసెట్ ఫ్రీజ్లు మూడు నెలల వరకు పొడిగింపులు వంటి చర్యలు తీసుకునేలా చట్టంలో మార్పులు చేశారు. అదే సమయంలో సరైన కారణం లేకుంటే మూడు నెలల తర్వాత అప్పీలు చేయవచ్చు. కొత్త చట్టం అధికారిక గెజిట్లో ప్రచురించిన తేదీ నుండి అమలులోకి వస్తుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్







