సౌదీ ప్రభుత్వ కార్యాలయాల్లో రైడ్స్..121 మంది అరెస్ట్..!!
- November 02, 2024
రియాద్: ఓవర్సైట్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) అక్టోబర్లో ఐదు ప్రభుత్వ ఏజెన్సీలలో అవినీతి కేసుల వివరాలను ప్రకటించింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ, నేషనల్ గార్డ్, మునిసిపాలిటీలు, హౌసింగ్ మంత్రిత్వ శాఖ, జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీలపై జరిపిన దాడుల్లో లంచం, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ పలువురిని అదుపులోకి తీసుకున్నారు.దర్యాప్తులో 322 మంది అనుమానితులను ప్రశ్నించగా, 121 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు బెయిల్పై విడుదలయ్యారని తెలిపారు. అక్టోబరులో నెలలో దాదాపు 1,903 రౌండ్ల తనిఖీలు నిర్వహించినట్టు నజాహా వెల్లడించింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









