ఖతార్ లో నేషనల్ ఏజింగ్ సర్వే ప్రారంభం..!!
- November 04, 2024
దోహా: నేషనల్ ప్లానింగ్ కౌన్సిల్, హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC) సహకారంతో పబ్లిక్ హెల్త్ మినిస్ట్రీ (MoPH) నిర్వహించే నేషనల్ ఏజింగ్ సర్వే కోసం ఫీల్డ్ వర్క్ అధికారికంగా ప్రారంభమైంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల ఆరోగ్యం, అవసరమైన సమాచారం అందించే లక్ష్యంతో ఫీల్డ్వర్క్ జనవరి 31, 2025 వరకు కొనసాగుతుంది. హెచ్ఎంసిలో దీర్ఘకాలిక సంరక్షణ, పునరావాసం వృద్ధాప్య సంరక్షణ డిప్యూటీ చీఫ్, నేషనల్ ఏజింగ్ సర్వే ప్రాజెక్ట్ హెడ్ డాక్టర్ హనాది అల్ హమద్ మాట్లాడుతూ.. “జాతీయ వృద్ధాప్య సర్వే ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఖతార్ చేస్తున్న ప్రయత్నాలలో ఒక కీలక దశను సూచిస్తుంది. ఇది వారికి అందించే ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రక్తపోటు, బరువు, వినికిడి,ఊపిరితిత్తుల పనితీరు పరీక్షలు, అలాగే శారీరక మానసిక సామర్థ్యాల పరీక్షలు సర్వేలో భాగంగా నిర్వహిస్తారు. అలాగే వారి జీవనశైలి విధానాలపై సమాచారాన్ని సేకరిస్తారు.’’ అని అన్నారు. సర్వే, ఫీల్డ్ టీమ్కు సంబంధించిన మరింత సమాచారం కోసం 16000 ద్వారా సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









