ఖతార్ లో నేషనల్ ఏజింగ్ సర్వే ప్రారంభం..!!
- November 04, 2024
దోహా: నేషనల్ ప్లానింగ్ కౌన్సిల్, హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC) సహకారంతో పబ్లిక్ హెల్త్ మినిస్ట్రీ (MoPH) నిర్వహించే నేషనల్ ఏజింగ్ సర్వే కోసం ఫీల్డ్ వర్క్ అధికారికంగా ప్రారంభమైంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల ఆరోగ్యం, అవసరమైన సమాచారం అందించే లక్ష్యంతో ఫీల్డ్వర్క్ జనవరి 31, 2025 వరకు కొనసాగుతుంది. హెచ్ఎంసిలో దీర్ఘకాలిక సంరక్షణ, పునరావాసం వృద్ధాప్య సంరక్షణ డిప్యూటీ చీఫ్, నేషనల్ ఏజింగ్ సర్వే ప్రాజెక్ట్ హెడ్ డాక్టర్ హనాది అల్ హమద్ మాట్లాడుతూ.. “జాతీయ వృద్ధాప్య సర్వే ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఖతార్ చేస్తున్న ప్రయత్నాలలో ఒక కీలక దశను సూచిస్తుంది. ఇది వారికి అందించే ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రక్తపోటు, బరువు, వినికిడి,ఊపిరితిత్తుల పనితీరు పరీక్షలు, అలాగే శారీరక మానసిక సామర్థ్యాల పరీక్షలు సర్వేలో భాగంగా నిర్వహిస్తారు. అలాగే వారి జీవనశైలి విధానాలపై సమాచారాన్ని సేకరిస్తారు.’’ అని అన్నారు. సర్వే, ఫీల్డ్ టీమ్కు సంబంధించిన మరింత సమాచారం కోసం 16000 ద్వారా సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో 290 కి.మీ. వేగంతో బైక్ పై స్టంట్లు.. రైడర్ షాక్..!!
- సౌదీలో 911 ఎమర్జెన్సీ నంబర్కు 2.7మిలియన్ కాల్స్..!!
- క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్..ప్రపంచంలో మూడో స్థానంలో ఒమన్..!!
- కింగ్ ఫహద్ రోడ్డులో వారం రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- నిర్మాణ పనుల శబ్దాలతో ఇబ్బందులు.. తెరపైకి కొత్త ప్రతిపాదన..!!
- ఖతార్లో సమ్మర్ సందడి.. కుటుంబాలతో ఎంజాయ్మెంట్కు స్వాగతం..!!
- యూఏఈ బతుకమ్మ సంబరాలకు కేటీఆర్కు ఆహ్వానం
- అమెరికా-ఇరాన్ చర్చలు సఫలమైతే తగ్గనున్న ఇంధన ధరలు: ట్రంప్
- షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్ల అమలుకు రాహుల్ డిమాండ్
- కళాకారుల ప్రతిభను విశ్వవ్యాప్తం చేసే వేదిక ‘అమరావతి చిత్రకళా వీధి’: మంత్రి దుర్గేష్







