ఇంత మొత్తాన్ని ఊహించలేదు.. 20 మిలియన్ దిర్హాంలు గెలిచిన ప్రవాస భారతీయులు..!!
- November 04, 2024
యూఏఈ: నవంబర్ 3న జరిగిన బిగ్ టిక్కెట్ డ్రాలో 20 మిలియన్ దిర్హామ్ల గ్రాండ్ ప్రైజ్ని ప్రవాస భారతీయుడు ప్రిన్స్ కొలస్సేరి సెబాస్టియన్ గెలుచుకున్నారు. షార్జా ఉండే ఈ కేరళ ప్రవాసుడు జాక్పాట్ కొట్టడంపై సంతోషం వ్యక్త చేశాడు. ఇంత మొత్తాన్ని ఊహించలేదని, డబ్బుతో ఏమి చేయాలో మాకు అర్థం కాలేదని అని ప్రిన్స్ అన్నారు. 2015లో యూఏఈకి వచ్చిన ప్రిన్స్.. తొమ్మిది మంది స్నేహితులతో కలిసి రాఫెల్స్లో పాల్గొంటున్నట్లు తెలిపాడు. ప్రతి ఒక్కరికి 2 మిలియన్ దిర్హామ్లు లభిస్తాయని చెప్పారు. ఆన్లైన్లో షో చూస్తున్న స్నేహితుడు మొదట నాకు కాల్ చేసి విషయం చెప్పాడని పేర్కొన్నాడు. తన స్వగ్రామంలో కొనసాగుతున్న తన ఇంటి నిర్మాణం కోసం డబ్బుల సమస్య తీరిందని చెప్పాడు. అలాగే తన పిల్లలను యూఏఈకి తీసుకొచ్చి ఇక్కడ చదువు చెప్పిస్తానని తెలిపాడు.
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









