ఇంత మొత్తాన్ని ఊహించలేదు.. 20 మిలియన్ దిర్హాంలు గెలిచిన ప్రవాస భారతీయులు..!!
- November 04, 2024
యూఏఈ: నవంబర్ 3న జరిగిన బిగ్ టిక్కెట్ డ్రాలో 20 మిలియన్ దిర్హామ్ల గ్రాండ్ ప్రైజ్ని ప్రవాస భారతీయుడు ప్రిన్స్ కొలస్సేరి సెబాస్టియన్ గెలుచుకున్నారు. షార్జా ఉండే ఈ కేరళ ప్రవాసుడు జాక్పాట్ కొట్టడంపై సంతోషం వ్యక్త చేశాడు. ఇంత మొత్తాన్ని ఊహించలేదని, డబ్బుతో ఏమి చేయాలో మాకు అర్థం కాలేదని అని ప్రిన్స్ అన్నారు. 2015లో యూఏఈకి వచ్చిన ప్రిన్స్.. తొమ్మిది మంది స్నేహితులతో కలిసి రాఫెల్స్లో పాల్గొంటున్నట్లు తెలిపాడు. ప్రతి ఒక్కరికి 2 మిలియన్ దిర్హామ్లు లభిస్తాయని చెప్పారు. ఆన్లైన్లో షో చూస్తున్న స్నేహితుడు మొదట నాకు కాల్ చేసి విషయం చెప్పాడని పేర్కొన్నాడు. తన స్వగ్రామంలో కొనసాగుతున్న తన ఇంటి నిర్మాణం కోసం డబ్బుల సమస్య తీరిందని చెప్పాడు. అలాగే తన పిల్లలను యూఏఈకి తీసుకొచ్చి ఇక్కడ చదువు చెప్పిస్తానని తెలిపాడు.
తాజా వార్తలు
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!









