ఇంత మొత్తాన్ని ఊహించలేదు.. 20 మిలియన్ దిర్హాంలు గెలిచిన ప్రవాస భారతీయులు..!!
- November 04, 2024
యూఏఈ: నవంబర్ 3న జరిగిన బిగ్ టిక్కెట్ డ్రాలో 20 మిలియన్ దిర్హామ్ల గ్రాండ్ ప్రైజ్ని ప్రవాస భారతీయుడు ప్రిన్స్ కొలస్సేరి సెబాస్టియన్ గెలుచుకున్నారు. షార్జా ఉండే ఈ కేరళ ప్రవాసుడు జాక్పాట్ కొట్టడంపై సంతోషం వ్యక్త చేశాడు. ఇంత మొత్తాన్ని ఊహించలేదని, డబ్బుతో ఏమి చేయాలో మాకు అర్థం కాలేదని అని ప్రిన్స్ అన్నారు. 2015లో యూఏఈకి వచ్చిన ప్రిన్స్.. తొమ్మిది మంది స్నేహితులతో కలిసి రాఫెల్స్లో పాల్గొంటున్నట్లు తెలిపాడు. ప్రతి ఒక్కరికి 2 మిలియన్ దిర్హామ్లు లభిస్తాయని చెప్పారు. ఆన్లైన్లో షో చూస్తున్న స్నేహితుడు మొదట నాకు కాల్ చేసి విషయం చెప్పాడని పేర్కొన్నాడు. తన స్వగ్రామంలో కొనసాగుతున్న తన ఇంటి నిర్మాణం కోసం డబ్బుల సమస్య తీరిందని చెప్పాడు. అలాగే తన పిల్లలను యూఏఈకి తీసుకొచ్చి ఇక్కడ చదువు చెప్పిస్తానని తెలిపాడు.
తాజా వార్తలు
- కువైట్లో 11 ఎక్స్ఛేంజ్ కంపెనీలపై తాత్కాలిక సస్పెన్షన్..!!
- గల్ఫ్లో సైబర్ దాడులు.. యూఏఈ, సౌదీ అరేబియాపైనే 50 శాతం..!!
- ఫిషింగ్, ఫేక్ మెసేజులపై ఖతార్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వార్నింగ్..!!
- ఒమన్లో విరిగిపడ్డ కొండచరియలు.. వాహనదారులకు కీలక హెచ్చరిక..!!
- AI వినియోగంపై అరబ్ దేశాలకు కీలక సూచనలు..!!
- సౌదీ నేషనల్ డే వేడుకలు.. జెడ్డా నుంచి అల్ ఖోబర్ వరకు వైమానిక విన్యాసాలు..!!
- సౌదీ అరేబియాకు యుద్ధ విమానాల విక్రయానికి అమెరికా ఆమోదం
- దుగరాజపట్నంలో గ్రీన్ఫీల్డ్ షిప్యార్డ్.. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు
- అక్టోబర్ 7న తిరిగి తెరుచుకోనున్న దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్
- కువైట్లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!







