దుబాయ్ పాఠశాలల్లో మీజిల్స్ టీకాలు తప్పనిసరి..!!
- November 04, 2024
యూఏఈ: యూఏఈలోని పాఠశాలలు దుబాయ్ హెల్త్ అథారిటీ (DHA)తో కలిసి ఈ నెలలో ప్రాథమిక విద్యార్థులకు ఉచిత టీకాలు వేయనున్నారు. మీజిల్స్ టీకా కార్యక్రమం గురించి తల్లిదండ్రులకు తెలియజేస్తూ జాతీయ మీజిల్స్ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఒకటి నుండి ఏడు సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు MMR (తట్టు, రుబెల్లా, గవదబిళ్ళ) టీకా ఒక డోసు మోతాదును అందుకుంటారు. విద్యార్థులందరికీ టీకా తప్పనిసరి అని అధికారులు తెలిపారు. యూఏఈలో MMR వ్యాక్సిన్ సాధారణంగా 12 నెలలకు, మళ్లీ 18 నెలలకు ఇస్తారు. దీంతోపాటు అదనపు బూస్టర్ షాట్ అవసరం అవుతుందని వైద్యులు తెలిపారు.
తాజా వార్తలు
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!







