యూఏఈలో మాదకద్రవ్యాలను ఎదుర్కోవడానికి జాతీయ వ్యూహం..షేక్ మహమ్మద్
- November 05, 2024
యూఏఈ: అబుదాబిలో ప్రారంభమైన ప్రభుత్వ వార్షిక సమావేశాల సందర్భంగా యూఏఈ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మాదకద్రవ్యాలను ఎదుర్కోవడానికి జాతీయ వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ వ్యూహంలో స్థానిక, అంతర్జాతీయంగా డ్రగ్స్ డీలర్లు ప్రమోటర్లను గుర్తించి నిరోధించడం, బాధితులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటివి ఉంటాయని తెలిపారు. సమావేశానికి యూఏఈ వైస్ ప్రెసిడెంట్ ప్రధాన మంత్రి దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధ్యక్షత వహించారు. ఈ మేరకు ప్రత్యేక వ్యూహాన్ని ప్రకటించారు. "డ్రగ్స్ ఒక శాపం, నష్టం, ఒక వ్యసనం... ఒక భ్రమ సామాజిక క్యాన్సర్తో పోరాడేందుకు అందరూ కలిసి ఉండాలి." అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!









