అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌ ముందుకొచ్చింది.

- June 24, 2016 , by Maagulf
అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌ ముందుకొచ్చింది.

అందరికీ అందుబాటులో, ఆమోదయోగ్యంగా ఉండాలనే అమరావతిని ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. కట్టుబట్టలతో హైదరాబాద్‌నుంచి వచ్చిన తెలుగువారికి ప్రపంచస్థాయి రాజధాని నిర్మించాలన్న ఉద్దేశంతోనే అమరావతి నిర్మాణంలో పలు దేశాలను భాగస్వాములను చేసినట్లు స్పష్టం చేశారు. ఆర్థిక సంక్షోభాలను దాటుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
విజయవాడలో నాలుగు గంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అమరావతి నగరాన్ని స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో నిర్మించేందుకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు తెలిపారు. సింగపూర్‌ ప్రభుత్వ సంస్థలు అసెండా సింగ్‌బ్రిడ్జి, సెమ్‌కార్ట్‌ స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో నిర్మాణం చేపట్టేందుకు ముందుకొచ్చినట్లు చెప్పారు. అమరావతి డెవలప్‌మెంట్‌ కంపెనీ, 2 సింగపూర్‌ కంపెనీలు కన్సార్టియంతో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌ ముందుకొచ్చిందని... దీనిపై చర్చలు జరుగుతున్నాయన్నారు.
అమరావతి నిర్మాణం కోసం అమరావతి డెవలప్‌మెంట్‌ పార్టనర్‌కు 1,691 ఎకరాలు అప్పజెప్పనున్నట్లు తెలిపారు. మూడు ఫేజ్‌లలో రాజధాని భూములు అప్పగిస్తామని... ఫేజ్‌-1లో అమరావతి డెవలప్‌మెంట్‌ పార్ట్‌నర్‌కు 200 ఎకరాలు ఇస్తామన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com