హైదరాబాద్ కు మరో కొత్త పరిశ్రమ
- November 15, 2024
హైదరాబాద్: వందేళ్ళ చరిత్ర కలిగిన అలెగ్రో మైక్రోసిస్టమ్స్ హైదరాబాద్ లోని సెమీ కండక్టర్స్ ఆర్ అండ్ డి సెంటర్ ను ఏర్పాటు చేయబోతోందని ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు అన్నారు. ఆటోమోటివ్ సెమీకండక్టర్స్లో గ్లోబల్ లీడర్, టెస్లా, టాటా వంటి అగ్ర ఈవీ బ్రాండ్లకు కీలకమైన సరఫరాదారు అయిన అల్లెగ్రో మైక్రోసిస్టమ్స్ ఈ సెంటర్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. ఈ వివరాలను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. వచ్చే ఐదు ఏళ్లలో 500 మందికి ఉపాధి కల్పించే లక్ష్యం అన్నారు. ఇండియాలో ఎన్నో ప్రధాన నగరాలను కాదని హైదరాబాదులో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారని తెలిపారు.
ప్రభుత్వపరంగా వారికి అన్ని విధాలా పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఇక్కడున్న ఎకో సిస్టం, స్కిల్ వర్కర్ల అవైలబిలిటీ, గవర్నమెంట్ పాలసీస్ ఇవన్నీ వ్యాపారానికి చాలా అనుకూలంగా ఉన్నాయన్నారు. దేశంలో ఎలక్ట్రానిక్ రంగంలో సెమీ కండక్టర్ల వినియోగం విరివిగా పెరుగుతుందన్నారు. ఆటోమేటివ్ ,ఇండస్ట్రీస్ రంగాలలో సెమీ కండక్టర్ల వినియోగంపై గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తారని తెలిపారు. అలెగ్రో మైక్రో సిస్టమ్స్ మ్యాగ్నెటిక్ సెన్సార్, పవర్ ఐసి మ్యానుఫ్యాక్చరింగ్ లో గ్లోబల్ లీడర్స్ అని తెలిపారు. ఈ రంగానికి చెందిన అతిపెద్ద కంపెనీ తెలంగాణకు రావడం చాలా సంతోషమని తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









