హైదరాబాద్ కు మరో కొత్త పరిశ్రమ
- November 15, 2024
హైదరాబాద్: వందేళ్ళ చరిత్ర కలిగిన అలెగ్రో మైక్రోసిస్టమ్స్ హైదరాబాద్ లోని సెమీ కండక్టర్స్ ఆర్ అండ్ డి సెంటర్ ను ఏర్పాటు చేయబోతోందని ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు అన్నారు. ఆటోమోటివ్ సెమీకండక్టర్స్లో గ్లోబల్ లీడర్, టెస్లా, టాటా వంటి అగ్ర ఈవీ బ్రాండ్లకు కీలకమైన సరఫరాదారు అయిన అల్లెగ్రో మైక్రోసిస్టమ్స్ ఈ సెంటర్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. ఈ వివరాలను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. వచ్చే ఐదు ఏళ్లలో 500 మందికి ఉపాధి కల్పించే లక్ష్యం అన్నారు. ఇండియాలో ఎన్నో ప్రధాన నగరాలను కాదని హైదరాబాదులో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారని తెలిపారు.
ప్రభుత్వపరంగా వారికి అన్ని విధాలా పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఇక్కడున్న ఎకో సిస్టం, స్కిల్ వర్కర్ల అవైలబిలిటీ, గవర్నమెంట్ పాలసీస్ ఇవన్నీ వ్యాపారానికి చాలా అనుకూలంగా ఉన్నాయన్నారు. దేశంలో ఎలక్ట్రానిక్ రంగంలో సెమీ కండక్టర్ల వినియోగం విరివిగా పెరుగుతుందన్నారు. ఆటోమేటివ్ ,ఇండస్ట్రీస్ రంగాలలో సెమీ కండక్టర్ల వినియోగంపై గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తారని తెలిపారు. అలెగ్రో మైక్రో సిస్టమ్స్ మ్యాగ్నెటిక్ సెన్సార్, పవర్ ఐసి మ్యానుఫ్యాక్చరింగ్ లో గ్లోబల్ లీడర్స్ అని తెలిపారు. ఈ రంగానికి చెందిన అతిపెద్ద కంపెనీ తెలంగాణకు రావడం చాలా సంతోషమని తెలిపారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







