ఉత్తరప్రదేశ్: ఆసుపత్రిలో ఘోర ప్రమాదం..
- November 16, 2024
ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం జరిగింది. చిన్న పిల్లల వార్డులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 10 మంది చిన్నారులు సజీవ దహనం అయ్యారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగింది. మంటలు ఆర్పుతోంది.
ఝాన్సీ మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో(ఎన్ఐసీయూ) ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది చిన్నారులు చనిపోగా, 16 మంది గాయపడ్డారు. 32 మంది చిన్నారులను కాపాడారు. అగ్ని ప్రమాదానికి ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా తెలుస్తోంది. ఆ సమయంలో ఇంకుబేటర్స్ లో ఉన్న పిల్లలు చనిపోయారు. చనిపోయిన వారంతా శిశువులుగా గుర్తించారు.
రాత్రి 10.30 నుంచి 10.45 గంటల సమయంలో ఎన్ఐసీయూ యూనిట్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఎన్ఐసీయూ వెలుపల ఉన్న చిన్నారులను అధికారులు కాపాడారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తీవ్రంగా గాయపడ్డ శిశువులకు చికిత్స అందిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు డ్యూటీలో ఉన్న స్టాఫ్ తెలిపారు.
ఈ దుర్ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనలో చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు సంతాపం తెలిపారాయన. ఈ ఘటన బాధాకరం అన్నారు యోగి ఆదిత్యనాథ్. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఒక్కసారిగా వార్డులో మంటలు చెలరేగడంతో శిశువుల తల్లిదండ్రులు భయాందోళనకు గురయయారు. అక్కడి నుంచి బయటపడే ప్రయత్నం చేశారు. అందరూ ఒక్కసారిగా బయటకు పరుగులు తీయడంతో అక్కడ తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 37 మంది చిన్నారులను ఆస్పత్రి నుంచి బయటకు తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని జిల్లా మేజిస్ట్రేట్ అవినాష్ కుమార్ చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందన్నారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







