దుబాయ్ బీచ్లో ఈత కొడుతూ.. 15 ఏళ్ల యువకుడు మృతి..!!
- November 18, 2024
యూఏఈ: దుబాయ్ లో విషాదం చోటుచేసుకుంది. అల్ మమ్జార్ బీచ్ లో ఈత కొడుతుండగా 15 ఏళ్ల భారతీయ ప్రవాసుడు చనిపోయాడు. దుబాయ్లోని న్యూ ఇండియన్ మోడల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న అహ్మద్ అబ్దుల్లా మఫాజ్ శుక్రవారం సాయంత్రం తన కుటుంబంతో కలిసి సరదాగా బీచ్ కు వచ్చిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.
"అతను తన స్నేహితులతో బయటకు వెళ్ళాల్సి ఉండే, మాతో రావాలని కోరగా వచ్చాడని, ఇలా జరుగుతుందని అనుకోలేదు" అని అతని తండ్రి మహ్మద్ అష్రఫ్ కన్నీటి పర్యంతమయ్యారు. ఒడ్డున ఆడుకుంటుండగా, భారీ కెరటం వాడిని చూస్తుండగానే సముద్రంలో కొట్టుకుపోయాడని విలపించాడు.
ఇదిలా ఉండగా, భయాందోళనకు గురైన కుటుంబం సహాయం కోసం కేకలు వేసిందని, సమీపంలో ఉన్న అరబ్ ఈతగాడు వారికి సహాయం వచ్చాడని, అతను మఫాజ్ సోదరిని రక్షించగలిగాడు, కానీ ఆ బాలుడు అప్పటికి కొట్టుకుపోయాడని కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్లో సామాజిక కార్యకర్త, వాలంటీర్ ఇబ్రహీం బెరికే చెప్పారు. శుక్రవారం సాయంత్రం బాలుడి కోసం వెతకగా, శనివారం మృతదేహాం లభ్యమైంది. దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన ఈ కుటుంబం చాలా సంవత్సరాలుగా యూఏఈలో నివసిస్తున్నారు. చనిపోయిన బాలుడు నలుగురు తోబుట్టువులలో మూడవవాడని అతడి బంధువులు తెలిపారు. ఇతర లాంఛనాలు పూర్తయిన తర్వాత బాలుడికి దుబాయ్లోనే అంత్యక్రియలు చేయనున్నట్లు బంధువులు తెలిపారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









