రాజన్నను దర్శించుకున్న సీఎం రేవంత్
- November 20, 2024
వేములవాడ: దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 127.65 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వచ్చిన సీఎం కు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ అఖిల్ మహాజన్, విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్ లు పుష్పగుచాల అందించి స్వాగతం పలికారు. అనంతరం సీఎం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.
తర్వాత రాజన్న ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభాన్ని దర్శించుకుని కోడే మొక్కలు చెల్లించారు. లక్ష్మి గణపతి ని దర్శించుకున్న అనంతరం రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని అభిషేకం నిర్వహించి మొక్కులు చెల్లించారు. అనంతరం రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆశీర్వాద మండపంలో ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వామి వారి చిత్రపటాన్ని అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్, ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







