దోహాలో 9వ ప్రపంచ తెలుగు సాహితీసదస్సును ప్రారంభించనున్న వెంకయ్యనాయుడు

- November 21, 2024 , by Maagulf
దోహాలో 9వ ప్రపంచ తెలుగు సాహితీసదస్సును ప్రారంభించనున్న వెంకయ్యనాయుడు

హైదరాబాద్: భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఇవాళ ఖతార్ పర్యటనకు బయలుదేరి వెళతారు అని పూర్వ ఉపరాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలు దేరి వెళ్ళనున్న ఆయన, రాత్రికి దోహా చేరుకుంటారు. రేపు అనగా శుక్రవారం ఉదయం గం. 10.00 ని.లకు (భారత కాల మానం ప్రకారం మధ్యాహ్నం గం. 1.30 ని.లకు) వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆంధ్ర కళావేదిక - ఖతార్ సంయుక్త ఆధ్వర్యంలో దోహా లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సును ప్రారంభించి, ప్రసంగిస్తారు.

కార్యక్రమం ముగించుకుని రేపు రాత్రికి దోహా నుంచి బయలుదేరి, శనివారం తెల్లవారు ఝామున చెన్నై చేరుకుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com