దోహాలో 9వ ప్రపంచ తెలుగు సాహితీసదస్సును ప్రారంభించనున్న వెంకయ్యనాయుడు
- November 21, 2024
హైదరాబాద్: భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఇవాళ ఖతార్ పర్యటనకు బయలుదేరి వెళతారు అని పూర్వ ఉపరాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలు దేరి వెళ్ళనున్న ఆయన, రాత్రికి దోహా చేరుకుంటారు. రేపు అనగా శుక్రవారం ఉదయం గం. 10.00 ని.లకు (భారత కాల మానం ప్రకారం మధ్యాహ్నం గం. 1.30 ని.లకు) వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆంధ్ర కళావేదిక - ఖతార్ సంయుక్త ఆధ్వర్యంలో దోహా లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సును ప్రారంభించి, ప్రసంగిస్తారు.
కార్యక్రమం ముగించుకుని రేపు రాత్రికి దోహా నుంచి బయలుదేరి, శనివారం తెల్లవారు ఝామున చెన్నై చేరుకుంటారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







