యూఏఈ విజిట్ వీసా: Dh3,000, రిటర్న్ టిక్కెట్లు, స్టే రుజువులు అవసరం..!!
- November 23, 2024
యూఏఈ: యూఏఈ సందర్శించే వారు విజిట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే ముందు అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. వారి చెప్పిన వివరాల ప్రకారం.. హోటల్ బుకింగ్ లేదా బంధువుల నివాస చిరునామా, తగినంత అమౌంట్, వీటికి సంబంధించిన రుజువులు సమర్పించాల్సి ఉంటుంది. “ఇంతకుముందు, ప్రయాణికులు విమానం ఎక్కేటప్పుడు విమానాశ్రయంలో స్టే, రిటర్న్ టిక్కెట్లు, Dh3,000 కు సమానమైన కరెన్సీ చూపించవలసి ఉంటుంది. అయితే, ఇప్పుడు వారు వీసా కోసం దరఖాస్తు చేయడానికి ముందు పత్రాలను సమర్పించాలి” అని గలాదరి ఇంటర్నేషనల్ ట్రావెల్ సర్వీసెస్ మేనేజర్ మీర్ వాసిం రాజా అన్నారు. విజిట్ వీసాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి వీటిని ప్రవేశపెట్టినట్టు ట్రావెల్ ఏజెంట్లు చెప్పారు. వీసా ఆమోదం కోసం స్టే, రిటర్న్ టిక్కెట్లు, బ్యాంక్ స్టేట్మెంట్లను తప్పనిసరిగా తమ సిస్టమ్లకు అప్లోడ్ చేయాలని ఏజెంట్లు తెలిపారు. అదే సమయంలో సందర్శకులు తమ పాస్పోర్ట్కు కనీసం ఆరు నెలల చెల్లుబాటు ఉండేలా చూసుకోవాలని గుర్తుచేశారు. ఎయిర్పోర్ట్ అధికారులు ఈ పత్రాల కోసం తనిఖీలు చేసే అవకాశం ఉందని, వీటిలో స్టే రుజువు, రిటర్న్ టిక్కెట్, నగదు లేదా క్రెడిట్ కార్డ్లో ఒక నెల వీసా కోసం Dh3,000, రెండు నెలలకు Dh5,000కి సమానమైన నిధులు ఉండాలి." అని ట్రావెల్ ఏజెంట్ తెలిపారు. ఒకవేళ సరైన పత్రాలను అందించడంలో విఫలమైతే వీసా రిజెక్ట్ అవుతుందన్నారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







