సౌదీ అరేబియాలో 22.8శాతం పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- November 25, 2024
రియాద్: సౌదీ అరేబియాలో చమురుయేతర ఎగుమతులు 22.8శాతం పెరిగాయి. ఈ మేరకు జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) వెల్లడించింది. సెప్టెంబర్ 2024లో చమురుయేతర ఎగుమతుల్లో 22.8% పెరుగుదలను ప్రకటించింది. చమురుయేతర జాతీయ ఎగుమతులు రీ-ఎగుమతులు మినహా 11.6% పెరిగాయని, తిరిగి ఎగుమతి చేసిన వస్తువుల విలువ 65.4 పెరిగిందని తెలిపింది. సెప్టెంబర్లో కమోడిటీ ఎగుమతుల్లో 14.9% తగ్గుదలని సూచించగా, మొత్తం ఎగుమతులలో చమురు ఎగుమతుల శాతం సెప్టెంబర్ 2023లో 79.7% నుండి సెప్టెంబర్ 2024లో 70.7%కి తగ్గింది. సెప్టెంబర్ 2024లో సౌదీ అరేబియా దిగుమతులు 15% పెరిగాయన్నారు. సెప్టెంబర్ 2024లో చమురుయేతర వస్తువుల ఎగుమతుల శాతం 37.1%కి పెరిగినట్లు నివేదికలో తెలిపారు. ఇదే సమయంలో 15% దిగుమతుల పెరుగుదలతో పోలిస్తే చమురుయేతర ఎగుమతులు 22.8%కి చేరాయని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







