500 దినార్లకు రెసిడెన్సీ పర్మిట్ల సేల్..కంపెనీ నిర్వాహకులు అరెస్ట్..!!
- November 27, 2024
కువైట్: 500 దినార్లకు రెసిడెన్సీ పర్మిట్ల సేల్ చేస్తున్నకంపెనీ నెట్ వర్క్ ను అధికారులు ఛేదించారు. సాధారణ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్ ఫోర్జరీ, అధికారిక పత్రాలను తారుమారు చేయడం, డబ్బుకు బదులుగా ప్రవాసులకు రెసిడెన్సీని కల్పించడం వంటి ఆరోపణలపై ఒక కువైట్ పౌరుడు, అతని బిజినెస్ పార్టనర్ సిరియన్ జాతీయుడితో సహా కంపెనీ నిర్వాహకుల ముఠాను అరెస్టు చేసినట్టు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిందితులు దేశంలో ఉన్న కార్మికుల రెసిడెన్సీలను చట్టవిరుద్ధంగా కంపెనీకి బదిలీ చేసారని, ఒక్కో కార్మికుడికి 500 దినార్ల చొప్పున కార్మికులకు హెవీ ఎక్విప్మెంట్ డ్రైవర్ రెసిడెన్సీని పొందేందుకు, కంపెనీ తన స్పాన్సర్షిప్ కింద రిఫర్ చేసిందని అధికారులు తెలిపారు దాదాపు 600 మంది కార్మికులు కంపెనీ కింద నమోదు చేసుకున్నట్టు గుర్తించినట్లు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వారిని సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









