టర్కీకి ఒమన్ సుల్తాన్.. వ్యూహాత్మక సంబంధాల పునాదికి నాంది..!!
- November 27, 2024
మస్కట్: 18 జూన్, 1973న ప్రారంభమైన యాభై సంవత్సరాల దౌత్య సంబంధాలను పురస్కరించుకుని హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్, రిపబ్లిక్ ఆఫ్ టర్కీకి వెళుతున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్తో సమావేశం అవుతారు. ఉమ్మడి ప్రయోజనాల కోసం వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారానికి సంబంధించి కీలక సమావేశాలు ఉంటాయని అధికార యంత్రాంగం ప్రకటించింది. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, సాంస్కృతిక విద్యాపరమైన సహకారంలో ఒమన్, టర్కీయే మరిన్ని విజయాలు సాధించాలని ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు.
నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) గణాంకాల ప్రకారం..రెండు దేశాల మధ్య వాణిజ్యం OMR216 మిలియన్లకు ($561.6 మిలియన్లు) చేరుకుంది. 2023లో ఇదే కాలంలో OMR208 మిలియన్ ($540.8 మిలియన్లు) కంటే ఇది అధికం. ఒమానీ చమురుయేతర దిగుమతిదారులలో టర్కీయే 17వ స్థానంలో ఉంది. ఇది ఐరోపాలో ఒమానీ నాన్-ఆయిల్ ఎగుమతులలో అతిపెద్ద దిగుమతి దేశంగా ఉంది. 2023 చివరి నాటికి ఒమన్ సుల్తానేట్లో టర్కీ వ్యాపారవేత్తలు, కంపెనీల పెట్టుబడులు OMR100 మిలియన్ కంటే ఎక్కువ (దాదాపు $267 మిలియన్లు)గా ఉన్నాయి. అదే సమయంలో రిపబ్లిక్ ఆఫ్ టర్కీలో ఒమానీ పౌరులు స్థాపించిన కంపెనీలు OMR75 మిలియన్లు ($195 మిలియన్లు) పెట్టుబడి పెట్టారు.
టర్కీయేకు ఒమానీ పర్యాటకుల సంఖ్య 2022లో రెండు దేశాలకు వీసా మినహాయింపు తర్వాత 130,000 కంటే ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించారు. ఉన్నత విద్యా రంగంలో గత అక్టోబర్లో ఒక అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేశాయి. ఇందులో స్కాలర్షిప్ల మార్పిడి, రెండు వైపుల మధ్య ఉన్నత విద్యా సంస్థల పరస్పర గుర్తింపు, సాంకేతికత, శిక్షణా కోర్సులు, సెమినార్లు, సింపోజియాలు, సమావేశాలు , ద్వైపాక్షిక ఫోరమ్లను నిర్వహించడం, పరిశోధనలను నిర్వహించడం వంటివి ఉన్నాయి.
టర్కీయేలో హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ పర్యటన రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలలో కొత్త శకానికి నాంది అవుతుందని రిపబ్లిక్ ఆఫ్ టర్కీలోని ఒమన్ రాయబారి సైఫ్ రషీద్ అల్ జహ్వారీ అన్నారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల స్థాపన 50వ వార్షికోత్సవంతో పాటు టర్కిష్ రిపబ్లిక్ స్థాపన శతాబ్ది ఉత్సవాల సందర్భంగా టర్కీ రిపబ్లిక్ జరుపుకోవడంతో సమానంగా ఉంటుందని ఆయన అన్నారు.హిజ్ మెజెస్టి ది సుల్తాన్,టర్కీ అధ్యక్షుడి మధ్య జరిగే చర్చలు తమ ప్రజలకు సేవ చేసే విధంగా రెండు దేశాల మధ్య మరింత వ్యూహాత్మక సంబంధాలకు పునాది వేస్తాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!







