తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్
- November 29, 2024
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ నిర్వహిస్తుంది. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఆనాటి ఉద్యమాన్ని గుర్తుచేసేందుకు బీఆర్ఎస్ దీక్షా దివస్ నిర్వహిస్తుంది. జిల్లాల ఇన్చార్జిల నేతృత్వంలో ర్యాలీలతో పాటు అమరవీరులకు నివాళులు, ఫొటో ఎగ్జిబిషన్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొంటున్నారు.
కేటీఆర్ ఉపన్యాసంపై ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేసే అవకాశం ఉంది. “నేడు దీక్షా దివస్.. తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన కేసీఆర్ దీక్ష.. తెలంగాణకు అప్పుడైనా.. ఇప్పుడైనా.. ఎప్పుడైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష. జై కేసీఆర్.. జై తెలంగాణ” అని బీఆర్ఎస్ పార్టీ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
తాజా వార్తలు
- యాదాద్రిలో గవర్నర్ దంపతులు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్
- బీసీసీఐ సంచలన నిర్ణయం..ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!









