నేటి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని యోగా సాధన గూర్చి ..
- June 26, 2016
'మన్ కీ బాత్' కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ఉదయం దేశ ప్రజలనుద్దేశించి ఆల్ఇండియా రేడియోలో ప్రసంగించారు. ఇస్రో శాస్త్రవేత్తలు ఒకే సారి 20 ఉపగ్రహాలు విజయవంతంగా ప్రయోగించి భారత ఖ్యాతిని సమున్నత శిఖరాలకు చేర్చుతున్నారని అభినందించారు. గత రికార్డులను ఈ ప్రయోగం ద్వారా బద్ధలు కొట్టినట్లయిందన్నారు. భారత వాయుసేనలో ముగ్గురు మహిళా పైలట్లు రావటం గొప్ప విషయమన్న ప్రధాని... ఈ ముగ్గురూ మెట్రో నగరాల నుంచి రాలేదు, చిన్న పట్టణాల నుంచి వచ్చి తమ కలలను సాకారం చేసుకున్నారన్నారు. మహిళా పైలట్ల తల్లిదండ్రులకు అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. యోగా శక్తిని ప్రపంచం గుర్తించింది.. ప్రపంచ వ్యాప్తంగా యోగా సాధన చేస్తున్న వాళ్లు పెరుగుతున్నారని తెలిపారు. యోగా ద్వారా రోగులు మధుమేహాన్ని తగ్గించుకోగలుగుతున్నారన్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







