నేటి 'మన్‌ కీ బాత్‌' కార్యక్రమంలో ప్రధాని యోగా సాధన గూర్చి ..

- June 26, 2016 , by Maagulf
నేటి  'మన్‌ కీ బాత్‌' కార్యక్రమంలో ప్రధాని యోగా సాధన గూర్చి ..

'మన్‌ కీ బాత్‌' కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ఉదయం దేశ ప్రజలనుద్దేశించి ఆల్‌ఇండియా రేడియోలో ప్రసంగించారు. ఇస్రో శాస్త్రవేత్తలు ఒకే సారి 20 ఉపగ్రహాలు విజయవంతంగా ప్రయోగించి భారత ఖ్యాతిని సమున్నత శిఖరాలకు చేర్చుతున్నారని అభినందించారు. గత రికార్డులను ఈ ప్రయోగం ద్వారా బద్ధలు కొట్టినట్లయిందన్నారు. భారత వాయుసేనలో ముగ్గురు మహిళా పైలట్లు రావటం గొప్ప విషయమన్న ప్రధాని... ఈ ముగ్గురూ మెట్రో నగరాల నుంచి రాలేదు, చిన్న పట్టణాల నుంచి వచ్చి తమ కలలను సాకారం చేసుకున్నారన్నారు. మహిళా పైలట్ల తల్లిదండ్రులకు అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. యోగా శక్తిని ప్రపంచం గుర్తించింది.. ప్రపంచ వ్యాప్తంగా యోగా సాధన చేస్తున్న వాళ్లు పెరుగుతున్నారని తెలిపారు. యోగా ద్వారా రోగులు మధుమేహాన్ని తగ్గించుకోగలుగుతున్నారన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com