తెలంగాణ: రామప్ప, సోమశిల అభివృద్ధికి కేంద్రం ముందడుగు
- November 29, 2024
వరంగల్: భారత పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా.. ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు 23 రాష్ట్రాల్లో 40 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 50 ఏళ్ల కాలవ్యవధితో రూ.3,295.76 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులకు వడ్డీ లేని రుణాలు అందించనున్నారు. ఇందులో తెలంగాణ నుంచి రెండు ప్రాంతాలను ఎంపిక చేశారు.
సస్టెయినబుల్ టూరిజం సర్క్యూట్ కింద రూ.74 కోట్లతో రామప్ప ఏరియా, వెల్ నెస్ అండ్ స్పిరిచువల్ రిట్రీట్ నల్లమల కింద రూ.68 కోట్లతో సోమశిల ఏరియాను అభివృద్ధి చేయనున్నారు.
ప్రజల ఆదరణ పొందిన ఆయా పర్యాటక ప్రాంతాలలో రద్దీని తగ్గించడం, అధునాతన సాంకేతికతలను సమర్థవంతంగా ఉపయోగించడం, స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, సందర్శకుల అనుభవాలను మెరుగుపరచడానికి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వరకు, భారతదేశ సహజమైన సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని చాటేలా ప్రతి ఒక్కరికీ ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించడానికి అనేక రకాల చర్యలను చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం









