అలెర్ట్..AI కెమెరాలతో ట్రాఫిక్ ఉల్లంఘనల రికార్డ్..!!
- November 30, 2024
కువైట్: ట్రాఫిక్ ఉల్లంఘనలను పర్యవేక్షించేందుకు అంతర్గత మంత్రిత్వ శాఖ AI కెమెరాల అమలును ప్రారంభించింది. ఏఐను ఉపయోగించి ఆటోమేటిక్ నిఘా కెమెరాలు ఇప్పటికే అమలులో ఉన్నాయని, రహదారిపై ఉల్లంఘనలను రికార్డ్ చేయడం ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ట్రాఫిక్కు ఆటంకం కలిగించే ఉల్లంఘనలు, డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నిరోధించేందుకు పర్యవేక్షించడానికి AI కెమెరాలు ఉపయోగించబడతాయని తెలిపింది. ట్రాఫిక్ నియమాలు, నిబంధనలను పాటించాలని, రహదారిపై ఇతరుల హక్కులను ఉల్లంఘించకుండా ఉండాలని మంత్రిత్వ శాఖ డ్రైవర్లందరికీ పిలుపునిచ్చింది. ఇటీవల కువైట్ మంత్రివర్గం కొత్త ట్రాఫిక్ చట్టాన్ని ఆమోదించింది. ఇది వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానాలను భారీగా పెంచింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







