అలెర్ట్..AI కెమెరాలతో ట్రాఫిక్ ఉల్లంఘనల రికార్డ్..!!
- November 30, 2024
కువైట్: ట్రాఫిక్ ఉల్లంఘనలను పర్యవేక్షించేందుకు అంతర్గత మంత్రిత్వ శాఖ AI కెమెరాల అమలును ప్రారంభించింది. ఏఐను ఉపయోగించి ఆటోమేటిక్ నిఘా కెమెరాలు ఇప్పటికే అమలులో ఉన్నాయని, రహదారిపై ఉల్లంఘనలను రికార్డ్ చేయడం ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ట్రాఫిక్కు ఆటంకం కలిగించే ఉల్లంఘనలు, డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నిరోధించేందుకు పర్యవేక్షించడానికి AI కెమెరాలు ఉపయోగించబడతాయని తెలిపింది. ట్రాఫిక్ నియమాలు, నిబంధనలను పాటించాలని, రహదారిపై ఇతరుల హక్కులను ఉల్లంఘించకుండా ఉండాలని మంత్రిత్వ శాఖ డ్రైవర్లందరికీ పిలుపునిచ్చింది. ఇటీవల కువైట్ మంత్రివర్గం కొత్త ట్రాఫిక్ చట్టాన్ని ఆమోదించింది. ఇది వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానాలను భారీగా పెంచింది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







