అంకారాలోని నేషన్స్ లైబ్రరీని సందర్శించిన సుల్తాన్
- November 30, 2024
అంకారా: అంకారాలో టర్కీ ప్రెసిడెన్షియల్ కాంప్లెక్స్లోని నేషన్స్ లైబ్రరీని హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ సందర్శించారు. ఈ సందర్భంగా లైబ్రరీ విభాగాలను, అందులోని విలువైన ప్రచురణలను, అరుదైన మాన్యుస్క్రిప్ట్లను వీక్షించారు. ఒమాన్-టర్కిష్ లకు సంబంధించిన చారిత్రక ఒప్పంద డాక్యుమెంట్లను ప్రత్యేకంగా ప్రదర్శించారు.
నేషన్స్ లైబ్రరీ రిపబ్లిక్ ఆఫ్ టర్కియేలో సుమారు 4 మిలియన్ ప్రింట్ కాపీలు, 120 మిలియన్ కంటే ఎక్కువ వ్యాసాలు, ఎలక్ట్రానిక్ శాస్త్రీయ ప్రచురణలు, ప్రపంచంలోని వివిధ దేశాల నుండి సేకరించిన వివిధ భాషలలోని 134,000 పుస్తకాలు ఉన్నాయి. లైబ్రరీలో ఒమానీ ప్రచురణల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు ఉంది. అనంతరం మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అల్ సయీద్ రెండు రోజుల (రాష్ట్ర) పర్యటన తర్వాత టర్కీయే నుండి బయలుదేరారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







