తృణధాన్యాల మాటున డ్రగ్స్ స్మగ్లింగ్.. 15 ఏళ్ల జైలు, BD 5,000 ఫైన్..!!
- November 30, 2024
మనామా: తృణధాన్యాల పెట్టెల్లో డ్రగ్స్ను అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తికి మొదటి హై క్రిమినల్ కోర్టు 15 సంవత్సరాల జైలు శిక్ష, BD 5,000 జరిమానా విధించింది. అరబ్ దేశం నుంచి వచ్చిన వ్యక్తి అనుమానాస్పద ప్రవర్తనపై విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు అనుమానం రావడంతో తనిఖీలు చేశారు. ఆ వ్యక్తి సామానులో 101 గ్రాముల గంజాయి, తృణధాన్యాల పెట్టెల్లో దాచిన 1,975 క్యాప్గాన్ మాత్రలు, 1,000కి పైగా సైకోట్రోపిక్ మాత్రలను గుర్తించినట్టు యాంటీ నార్కోటిక్స్ డైరెక్టరేట్ కోర్టుకు తెలిపింది. అలాగే అతడు ఇచ్చిన సమాచారంతో అతని ఇంటిపై రైడ్ చేసి 34.47 గ్రాముల గంజాయిని సీజ్ చేసినట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







