పెట్రోలింగ్ కారును ఢీకొట్టిన వాహనం.. ఇద్దరు పోలీసులు మృతి..!!
- December 04, 2024
కువైట్: కువైట్ లోని ఫహాహీల్ ఎక్స్ప్రెస్ వేలో సాల్వా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసు పెట్రోలింగ్ కారును మరో బలంగా ఢీకొన్నది. ఈ దుర్ఘటనలో డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. అధికారుల కథనం ప్రకారం.. ఢీకొట్టిన తర్వాత నిందితుడు సంఘటనా స్థలం నుండి పారిపోయాడు. అలెర్టయిన పోలీసులు నిమిషాల వ్యవధిలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు బహిష్కృతుడని, డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు తెలిపారు. సాల్వా ప్రాంతానికి సమీపంలో ఉన్న వంతెనపై పోలీసు అధికారులు ఆగిన వాహనాన్ని పరిశీలిస్తుండగా, వేగంగా వచ్చిన కారు వారిని నేరుగా ఢీకొట్టింది. ఇదిలా ఉండగా, డ్యూటీలో ఉన్న ఇద్దరు అధికారుల మృతికి అంతర్గత మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









