పెట్రోలింగ్ కారును ఢీకొట్టిన వాహనం.. ఇద్దరు పోలీసులు మృతి..!!
- December 04, 2024
కువైట్: కువైట్ లోని ఫహాహీల్ ఎక్స్ప్రెస్ వేలో సాల్వా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసు పెట్రోలింగ్ కారును మరో బలంగా ఢీకొన్నది. ఈ దుర్ఘటనలో డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. అధికారుల కథనం ప్రకారం.. ఢీకొట్టిన తర్వాత నిందితుడు సంఘటనా స్థలం నుండి పారిపోయాడు. అలెర్టయిన పోలీసులు నిమిషాల వ్యవధిలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు బహిష్కృతుడని, డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు తెలిపారు. సాల్వా ప్రాంతానికి సమీపంలో ఉన్న వంతెనపై పోలీసు అధికారులు ఆగిన వాహనాన్ని పరిశీలిస్తుండగా, వేగంగా వచ్చిన కారు వారిని నేరుగా ఢీకొట్టింది. ఇదిలా ఉండగా, డ్యూటీలో ఉన్న ఇద్దరు అధికారుల మృతికి అంతర్గత మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







