పెట్రోలింగ్ కారును ఢీకొట్టిన వాహనం.. ఇద్దరు పోలీసులు మృతి..!!
- December 04, 2024
కువైట్: కువైట్ లోని ఫహాహీల్ ఎక్స్ప్రెస్ వేలో సాల్వా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసు పెట్రోలింగ్ కారును మరో బలంగా ఢీకొన్నది. ఈ దుర్ఘటనలో డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. అధికారుల కథనం ప్రకారం.. ఢీకొట్టిన తర్వాత నిందితుడు సంఘటనా స్థలం నుండి పారిపోయాడు. అలెర్టయిన పోలీసులు నిమిషాల వ్యవధిలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు బహిష్కృతుడని, డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు తెలిపారు. సాల్వా ప్రాంతానికి సమీపంలో ఉన్న వంతెనపై పోలీసు అధికారులు ఆగిన వాహనాన్ని పరిశీలిస్తుండగా, వేగంగా వచ్చిన కారు వారిని నేరుగా ఢీకొట్టింది. ఇదిలా ఉండగా, డ్యూటీలో ఉన్న ఇద్దరు అధికారుల మృతికి అంతర్గత మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









