రియాద్ జనాభాలో సగానికి పైగా విదేశీయులు..!!
- December 04, 2024
రియాద్: రియాద్ నగర జనాభాలో సగానికి పైగా సౌదీయేతర నివాసితులు ఉన్నారని రియాద్ మేయర్ ప్రిన్స్ డా. ఫైసల్ బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ అయ్యఫ్ తెలిపారు. ఇది రియాద్ ఆర్థిక బలం, వైవిధ్యం, ఆకర్షణను ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం సౌదీ-ఫ్రెంచ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్లో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రిన్స్ ఫైసల్ సౌదీ అరేబియా, ఫ్రాన్స్ మధ్య ఒక శతాబ్దానికి పైగా ఉన్న దీర్ఘకాల సంబంధాలను వివరించారు.
1967లో కింగ్ ఫైసల్ ఫ్రాన్స్ పర్యటన, ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచిన చారిత్రాత్మక ఘట్టంగా నిలిచాయన్నారు. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ 2018 ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా సౌదీ-ఫ్రెంచ్ కంపెనీల మధ్య $18 బిలియన్లకు పైగా విలువైన 19 ఒప్పందాలు కుదిరాయని పేర్కొన్నారు. పెట్రోకెమికల్స్, వాటర్ ట్రీట్మెంట్, టూరిజం, కల్చర్ వంటి రంగాలలో ఈ ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. 1997లో అప్పటి రియాద్ గవర్నర్గా ఉన్న రాజు సల్మాన్ పర్యటన సందర్భంగా రియాద్ -ప్యారిస్ మధ్య ప్రత్యేక సంబంధం ఏర్పడిందన్నారు.
సౌదీ విజన్ 2030లో భాగంగా రియాద్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక మార్పుల గురించి ప్రిన్స్ ఫైసల్ వివరించారు. సంపన్నమైన, సుస్థిరమైన భవిష్యత్తుకు మార్గదర్శి నగరంగా రియాద్ నిలుస్తుందన్నారు. ఆ మేరకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన నగరాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ప్రజా రవాణా కార్యక్రమాలలో ఒకటైన రియాద్ మెట్రో ప్రాజెక్ట్.. అలాగే దిరియా, కిద్దియా, కింగ్ సల్మాన్ ఎకనామిక్ పార్కుల గురించి వివరించారు. ఈ ప్రాజెక్టులు జీవన నాణ్యతను మెరుగుపరచడం, రియాద్ను ప్రధాన ప్రపంచ గమ్యస్థానంగా స్థాపించడం లక్ష్యంగా పెట్టుకున్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్న్యూస్
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్కు కొత్త అద్దె సూచిక.. కొత్త చట్టంతో పారదర్శకతకు ప్రాధాన్యం
- కువైట్లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్లో అల్ అమెరికాత్ ఓవర్పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే







