1,284 మద్యం బాటిల్స్ సీజ్.. 17 మంది అరెస్ట్..!!
- December 06, 2024
కువైట్: కువైట్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో మద్య పానీయాలను ప్రచారం చేస్తున్న వివిధ దేశాలకు చెందిన 17 మంది అనుమానితులను డ్రగ్ కంట్రోల్ జనరల్ డిపార్ట్మెంట్ అదుపులోకి తీసుకుంది. వారిచ్చిన సమాచారంతో దాదాపు 100,000 కువైట్ దీనార్ల మార్కెట్ విలువైన 1284 లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న వస్తువులను డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ ప్రాసిక్యూషన్ కార్యాలయానికి అప్పగించినట్లు తెలిపారు. వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







