బహ్రెయిన్ ఫెస్టివిటీస్ 2024..12 క్రూయిజ్ షిప్లకు స్వాగతం..!!
- December 06, 2024మనామా: బహ్రెయిన్ ఫెస్టివిటీస్ 2024 వేడుకల్లో భాగంగా ఈ డిసెంబర్లో కింగ్డమ్ ఆఫ్ బహ్రెయిన్ 12 లగ్జరీ క్రూయిజ్ షిప్లకు స్వాగతం పలుకనున్నట్లు బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సారా అహ్మద్ బుహేజీ ప్రకటించారు. సముద్ర పర్యాటకాన్ని పెంపొందించడానికి, జాతీయ పర్యాటక వ్యూహం 2022-2026లో పేర్కొన్న లక్ష్యాలను సాధించడానికి బహ్రెయిన్ కొనసాగుతున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
ఇటువంటి వైవిధ్యమైన క్రూయిజ్ షిప్లను స్వాగతించడం బహ్రెయిన్ ప్రముఖ ప్రాంతీయ పర్యాటక గమ్యస్థానంగా హైలైట్ అవుతుందని బుహేజీ అన్నారు. గ్రీక్ నౌక "సెలెస్టైల్ జర్నీ", గల్ఫ్లో అరంగేట్రం చేసిందని, ఫ్రెంచ్ క్రూయిజ్ షిప్ "లే బౌగెన్విల్లే", జర్మన్ AIDA ఫ్లీట్, స్విస్-ఇటాలియన్ MSC క్రూయిజ్లు త్వరలో రానున్నట్లు పేర్కొన్నారు.
ఈ క్రూయిజ్ షిప్ సందర్శనలు పర్యాటకులకు బహ్రెయిన్ ఫెస్టివిటీస్ 2024 కార్యకలాపాలను ఆస్వాదించడానికి, శీతాకాలపు బీచ్ టూరిజంను ఎంజాయ్ చేసేందుకు, అదే సమయంలో బహ్రెయిన్ శక్తివంతమైన మార్కెట్లు, మాల్స్, వారసత్వ ప్రదేశాలు, పురావస్తు ప్రదేశాలను చూసేందుకు అవకాశం కల్పిస్తాయని బుహెజీ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్గాన్ పిల్స్ సీజ్..!!