అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి సమన్లు జారీ చేసిన పోలీసులు
- December 06, 2024
హైదరాబాద్: ప్రముఖ నటుడు అల్లు అర్జున్ తన అభిమానులను ‘ఆర్మీ’ అని పిలవడం వల్ల పై కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే, ఇటీవల పుష్ప 2 ప్రమోషన్ కార్యక్రమంలో అల్లు అర్జున్ తన అభిమానులను ‘అల్లు ఆర్మీ’ అని పిలవడం కొంతమందికి అభ్యంతరం కలిగించింది. ‘ఆర్మీ’ అనే పదం దేశ రక్షణ దళాలకు సంబంధించినది కాబట్టి దానిని అభిమానులకు వాడకూడదని శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైదరాబాద్లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అల్లు అర్జున్ తన అభిమానులను ‘ఆర్మీ’ అని పిలవడం వల్ల దేశ రక్షణ దళాల గౌరవాన్ని దెబ్బతీస్తుందని ఇది చట్టవిరుద్ధమని శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ ను విచారించేందుకు సమన్లు జారీ చేశారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఈ ఘటన పై అల్లు అర్జున్ స్పందిస్తూ, తన అభిమానులను ‘ఆర్మీ’ అని పిలవడం ద్వారా వారిని గౌరవించాలనే ఉద్దేశ్యంతో మాత్రమే చేశానని ఎవరినీ కించపరచాలనే ఉద్దేశ్యం లేదని తెలిపారు.ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







