అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి సమన్లు జారీ చేసిన పోలీసులు
- December 06, 2024
హైదరాబాద్: ప్రముఖ నటుడు అల్లు అర్జున్ తన అభిమానులను ‘ఆర్మీ’ అని పిలవడం వల్ల పై కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే, ఇటీవల పుష్ప 2 ప్రమోషన్ కార్యక్రమంలో అల్లు అర్జున్ తన అభిమానులను ‘అల్లు ఆర్మీ’ అని పిలవడం కొంతమందికి అభ్యంతరం కలిగించింది. ‘ఆర్మీ’ అనే పదం దేశ రక్షణ దళాలకు సంబంధించినది కాబట్టి దానిని అభిమానులకు వాడకూడదని శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైదరాబాద్లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అల్లు అర్జున్ తన అభిమానులను ‘ఆర్మీ’ అని పిలవడం వల్ల దేశ రక్షణ దళాల గౌరవాన్ని దెబ్బతీస్తుందని ఇది చట్టవిరుద్ధమని శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ ను విచారించేందుకు సమన్లు జారీ చేశారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఈ ఘటన పై అల్లు అర్జున్ స్పందిస్తూ, తన అభిమానులను ‘ఆర్మీ’ అని పిలవడం ద్వారా వారిని గౌరవించాలనే ఉద్దేశ్యంతో మాత్రమే చేశానని ఎవరినీ కించపరచాలనే ఉద్దేశ్యం లేదని తెలిపారు.ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







