అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి సమన్లు జారీ చేసిన పోలీసులు
- December 06, 2024హైదరాబాద్: ప్రముఖ నటుడు అల్లు అర్జున్ తన అభిమానులను ‘ఆర్మీ’ అని పిలవడం వల్ల పై కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే, ఇటీవల పుష్ప 2 ప్రమోషన్ కార్యక్రమంలో అల్లు అర్జున్ తన అభిమానులను ‘అల్లు ఆర్మీ’ అని పిలవడం కొంతమందికి అభ్యంతరం కలిగించింది. ‘ఆర్మీ’ అనే పదం దేశ రక్షణ దళాలకు సంబంధించినది కాబట్టి దానిని అభిమానులకు వాడకూడదని శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైదరాబాద్లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అల్లు అర్జున్ తన అభిమానులను ‘ఆర్మీ’ అని పిలవడం వల్ల దేశ రక్షణ దళాల గౌరవాన్ని దెబ్బతీస్తుందని ఇది చట్టవిరుద్ధమని శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ ను విచారించేందుకు సమన్లు జారీ చేశారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఈ ఘటన పై అల్లు అర్జున్ స్పందిస్తూ, తన అభిమానులను ‘ఆర్మీ’ అని పిలవడం ద్వారా వారిని గౌరవించాలనే ఉద్దేశ్యంతో మాత్రమే చేశానని ఎవరినీ కించపరచాలనే ఉద్దేశ్యం లేదని తెలిపారు.ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్గాన్ పిల్స్ సీజ్..!!