జెబెల్ జైస్ పర్వతం నుండి జారి, భారతీయ ప్రవాసుడు మృతి..!!
- December 06, 2024
యూఏఈ: కేరళకు చెందిన 32 ఏళ్ల భారతీయ ప్రవాసుడు రస్ అల్ ఖైమాలోని జెబెల్ జైస్ పర్వతం నుండి జారి మరణించాడు. జాతీయ దినోత్సవ సెలవుల సమయంలో ముగ్గురు స్నేహితులతో కలిసి క్యాంపింగ్కు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. "వీరు సోమవారం రాత్రి పర్వతానికి చేరుకున్నారు. అక్కడ క్యాంపింగ్ వేశారు." అని ఇంకాస్ అధ్యక్షుడు, వరల్డ్ మలయాళీ కౌన్సిల్ ప్రతినిధి నాసర్ అల్ మహా అన్నారు. "ఈ విషాదకరమైన సంఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. సంఘటన జరగడంతో, అతని స్నేహితులు వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు. మరణాన్ని అధికారులు ధృవీకరించారు. అతని మృతదేహాన్ని రస్ అల్ ఖైమాలోని సకర్ ఆసుపత్రికి తరలించారు." అని పేర్కొన్నారు. సందర్శకులు జెబెల్ జైస్ వంటి పర్వత ప్రాంతాలలో జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా కొండ అంచుల దగ్గర ఫోటోలు దిగడం వంటి ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కోరారు. మృతదేహాన్ని అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేసిన తర్వాత కేరళకు తరలించినట్లు తెలిపారు. ఆయన అంత్యక్రియలు త్వరలో జరగనున్నాయి.
తాజా వార్తలు
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!
- 'రైల్ వన్’ యాప్లో ఉచిత OTT వినోదం!
- ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!









