హెరిటేజ్ విలేజ్లో 'సెలబ్రేట్ బహ్రెయిన్' ఫెస్టివల్ ప్రారంభం..!!
- December 13, 2024
మనామా: రాస్ హయాన్లోని హెరిటేజ్ విలేజ్లో సమాచార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న "సెలబ్రేట్ బహ్రెయిన్" ఫెస్టివల్ను హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ప్రారంభించారు. 1783లో అహ్మద్ అల్ ఫతేహ్ చేత ఆధునిక అరబ్, ముస్లిం రాజ్యంగా స్థాపించబడిన బహ్రెయిన్ రాజ్య జాతీయ దినోత్సవాలను పురస్కరించుకొని ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తారు. హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా సింహాసనాన్ని అధిష్టించిన వార్షికోత్సవాన్ని ఇది గుర్తుగా కూడా నిర్వహిస్తారు. జాతీయ దినోత్సవ వేడుకలు బహ్రెయిన్ ప్రజల పౌరసత్వం, జాతీయ గుర్తింపు విలువలను ప్రతిబింబిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా హెచ్హెచ్ షేక్ మొహమ్మద్ బిన్ సల్మాన్ హెచ్ఎం రాజు, హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ సల్మాన్లకు తన అభినందనలు తెలియజేశారు. ఈ ఉత్సవంలో బహ్రెయిన్ జానపద కథలు, వారసత్వాన్ని తేలిపే ప్రదర్శనలు ఉంటాయని, ఇది బహ్రెయిన్ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని, ఇది భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని అందిస్తుందన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- Kuwait air defences intercept Iranian missile, drone attacks
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!







