హెరిటేజ్ విలేజ్లో 'సెలబ్రేట్ బహ్రెయిన్' ఫెస్టివల్ ప్రారంభం..!!
- December 13, 2024
మనామా: రాస్ హయాన్లోని హెరిటేజ్ విలేజ్లో సమాచార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న "సెలబ్రేట్ బహ్రెయిన్" ఫెస్టివల్ను హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ప్రారంభించారు. 1783లో అహ్మద్ అల్ ఫతేహ్ చేత ఆధునిక అరబ్, ముస్లిం రాజ్యంగా స్థాపించబడిన బహ్రెయిన్ రాజ్య జాతీయ దినోత్సవాలను పురస్కరించుకొని ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తారు. హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా సింహాసనాన్ని అధిష్టించిన వార్షికోత్సవాన్ని ఇది గుర్తుగా కూడా నిర్వహిస్తారు. జాతీయ దినోత్సవ వేడుకలు బహ్రెయిన్ ప్రజల పౌరసత్వం, జాతీయ గుర్తింపు విలువలను ప్రతిబింబిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా హెచ్హెచ్ షేక్ మొహమ్మద్ బిన్ సల్మాన్ హెచ్ఎం రాజు, హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ సల్మాన్లకు తన అభినందనలు తెలియజేశారు. ఈ ఉత్సవంలో బహ్రెయిన్ జానపద కథలు, వారసత్వాన్ని తేలిపే ప్రదర్శనలు ఉంటాయని, ఇది బహ్రెయిన్ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని, ఇది భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని అందిస్తుందన్నారు.
తాజా వార్తలు
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!









