హెరిటేజ్ విలేజ్లో 'సెలబ్రేట్ బహ్రెయిన్' ఫెస్టివల్ ప్రారంభం..!!
- December 13, 2024
మనామా: రాస్ హయాన్లోని హెరిటేజ్ విలేజ్లో సమాచార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న "సెలబ్రేట్ బహ్రెయిన్" ఫెస్టివల్ను హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ప్రారంభించారు. 1783లో అహ్మద్ అల్ ఫతేహ్ చేత ఆధునిక అరబ్, ముస్లిం రాజ్యంగా స్థాపించబడిన బహ్రెయిన్ రాజ్య జాతీయ దినోత్సవాలను పురస్కరించుకొని ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తారు. హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా సింహాసనాన్ని అధిష్టించిన వార్షికోత్సవాన్ని ఇది గుర్తుగా కూడా నిర్వహిస్తారు. జాతీయ దినోత్సవ వేడుకలు బహ్రెయిన్ ప్రజల పౌరసత్వం, జాతీయ గుర్తింపు విలువలను ప్రతిబింబిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా హెచ్హెచ్ షేక్ మొహమ్మద్ బిన్ సల్మాన్ హెచ్ఎం రాజు, హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ సల్మాన్లకు తన అభినందనలు తెలియజేశారు. ఈ ఉత్సవంలో బహ్రెయిన్ జానపద కథలు, వారసత్వాన్ని తేలిపే ప్రదర్శనలు ఉంటాయని, ఇది బహ్రెయిన్ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని, ఇది భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని అందిస్తుందన్నారు.
తాజా వార్తలు
- మహిళా క్రికెటర్ల ఫీజుపెంచిన BCCI
- కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!
- తొలి ఆర్వీ రూట్ ను ప్రారంభించిన దుబాయ్..!!
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు







