షార్జాలో కత్తిపోట్లతో 27 ఏళ్ల యువకుడు మృతి..!!
- December 13, 2024
యూఏఈ: షార్జాలో అల్ సియూహ్లో 27 ఏళ్ల ఎమిరాటీ వ్యక్తి కత్తిపోట్ల కారణంగా ప్రాణాలను కోల్పోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఘటనకు సంబంధించి షార్జా పోలీస్ ఆపరేషన్స్ గదికి గురువారం అర్ధరాత్రి 12.40 గంటలకు కాల్ వచ్చింది. పోలీసు పెట్రోలింగ్, క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ టీమ్, నేషనల్ అంబులెన్స్ సేవలను వెంటనే ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ వారు బాధితుడు డు కత్తిపోట్లకు గురై మృత్యువుతో పోరాడుతున్నాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
12 గంటల్లో షార్జా పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఈ సంఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు సోదరులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి మధ్య వివాదం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గొడవల కారణంగా పదునైన వస్తువుతో బాధితుడిని పొడిచినట్టు నిందితులువిచారణలో అంగీకరించారు. తదుపరి విచారణ కోసం కేసు పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్టు పోలీసులు తెలిపారు.వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, హింసకు పాల్పడకుండా ఉండాలని షార్జా పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







