అల్లు అర్జున్కు 14 రోజుల రిమాండ్..!
- December 13, 2024
సినీ నటుడు అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్ ను చంచల గూడ జైలుకు పోలీసులు తరలించనున్నారు.
డిసెంబర్ 4న ‘పుష్ప2’ ప్రీమియర్ షో సందర్బంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ అల్లు అర్జున్ రావడంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. మృతిరాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆయన వాంగూల్మాన్ని నమోదు చేసుకున్నారు. ఆ తరువాత గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం నాంపల్లిలోని 9వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.
తాజా వార్తలు
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు









