అల్లు అర్జున్కు 14 రోజుల రిమాండ్..!
- December 13, 2024
సినీ నటుడు అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్ ను చంచల గూడ జైలుకు పోలీసులు తరలించనున్నారు.
డిసెంబర్ 4న ‘పుష్ప2’ ప్రీమియర్ షో సందర్బంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ అల్లు అర్జున్ రావడంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. మృతిరాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆయన వాంగూల్మాన్ని నమోదు చేసుకున్నారు. ఆ తరువాత గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం నాంపల్లిలోని 9వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









