అల్లు అర్జున్కు ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు..
- December 13, 2024
సినీ నటుడు అల్లు అర్జున్కు హైకోర్టులో కాస్త ఊరట లభించింది. న్యాయస్థానం మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టి వేయాలని బన్నీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. వాదానలు విన్న న్యాయస్థానం బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది. ఈ క్రమంలో శుక్రవారం అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ11గా పోలీసులు పేర్కొన్నారు. మధ్యాహ్నాం 1.30కి అరెస్టు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.
క్వాష్ పిటిషన్పై విచారణ అత్యవసరం కాదని, సోమవారం వినాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) న్యాయస్థానాన్ని కోరారు. అల్లు అర్జున్ అరెస్టయినందున బెయిల్ కోసం అవసరమైతే మరో పిటిషన్ వేసుకోవాలన్నారు. క్వాష్ పిటిషన్లోనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









