అల్లు అర్జున్కు ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు..
- December 13, 2024
సినీ నటుడు అల్లు అర్జున్కు హైకోర్టులో కాస్త ఊరట లభించింది. న్యాయస్థానం మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టి వేయాలని బన్నీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. వాదానలు విన్న న్యాయస్థానం బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది. ఈ క్రమంలో శుక్రవారం అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ11గా పోలీసులు పేర్కొన్నారు. మధ్యాహ్నాం 1.30కి అరెస్టు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.
క్వాష్ పిటిషన్పై విచారణ అత్యవసరం కాదని, సోమవారం వినాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) న్యాయస్థానాన్ని కోరారు. అల్లు అర్జున్ అరెస్టయినందున బెయిల్ కోసం అవసరమైతే మరో పిటిషన్ వేసుకోవాలన్నారు. క్వాష్ పిటిషన్లోనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.
తాజా వార్తలు
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు









