సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ సందర్శన సమయాల పై వివరణ
- December 16, 2024
హైదరాబాద్: కొన్ని పత్రికల్లో సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ సందర్శన సమయాలు మధ్యాహ్నం 4 నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఉంటాయని తప్పుగా ప్రచురించడం జరిగింది.ఈ విషయం పై స్పష్టత ఇవ్వడం జరుగుతోంది.
సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ 24 గంటలూ, 7 రోజులు పనిచేస్తుంది.అందువల్ల ఎవరైనా సైబర్ నేరాలను నివేదించవచ్చు లేదా ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకోవచ్చు.
కేసు స్థితి వివరాలు తెలుసుకోవాలనుకునే వారు ప్రత్యేకంగా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం 4 గంటల నుండి 5 గంటల వరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి వివరాలు తెలుసుకోవచ్చు.తద్వారా అధికారులు కేసుల దర్యాప్తు కోసం మరింత సమయం కేటాయించగలరు.
సైబర్ నేరాలు లేదా అత్యవసర సహాయం అవసరమైన వారు ఎప్పుడైనా సంప్రదించవచ్చు.
హెల్ప్లైన్ నెంబర్: 1930– 24 గంటలూ అందుబాటులో ఉంటుంది.
సైబర్ క్రైమ్ వెబ్సైట్: http://www.cybercrime.gov.in–ఆన్లైన్ ఫిర్యాదుల కోసం.
సైబర్ క్రైమ్ స్టేషన్ నెంబర్: 94906 17310–సహాయం కోసం.
ప్రజలందరూ ధృవీకరించిన సమాచారాన్ని మాత్రమే నమ్మాలి.సైబర్ నేరాల నియంత్రణలో మీ సహకారం అవసరం.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు