యూఏఈలో 20% వరకు పెరిగిన ఫైట్స్, హోటల్స్ ధరలు..!!
- December 18, 2024
యూఏఈ: యూఏఈలో వాతావరణం చల్లబడటంతో హాలిడే ట్రావెల్ పెరిగింది. దాంతో సీకేషన్ బుకింగ్లలో పెరుగుదల నమదవుతుంది. అయితే, చివరి నిమిషంలో విహారయాత్రకు వెళ్లేవారు అధిక ఖర్చులను ఎదుర్కోవచ్చని, గమ్యస్థానం, వసతి, విమానాలు, హోటళ్లు, వీసా లభ్యత వంటి కారణాల వల్ల ధరలు సాధారణంగా 15 నుండి 20 శాతం వరకు పెరుగుతాయని ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. వింటర్ ముఖ్యంగా డిసెంబర్ మధ్య నుండి జనవరి ప్రారంభం వరకు ఉంటుంది. ఆ సమయంలో స్కూల్స్ సెలవులు, క్రిస్మస్, నూతన సంవత్సరానికి విదేశాలకు వెళ్లడం వలన ధరలు పెరుగుతాయి. అధిక ధరలు ఉన్నప్పటికీ, చాలా మంది నివాసితులు ఇప్పటికీ ఈ సెలవు సీజన్లో చివరి నిమిషంలో ప్రయాణాలను ఎంచుకుంటున్నారని ట్రావెల్ ఏజెంట్లు తెలిపారు.
సాధారణంగా వింటర్ సీజన్ కు విమాన ఛార్జీలు, హోటల్స్ ధరలు ఇతర కార్యకలాపాల డిమాండ్ పీక్స్లో పెరుగుతాయి. విమాన ఛార్జీలు, హోటల్ ధరలు..సీజన్ లో ఆయా తేదీలను బట్టి డిమాండ్ పెరిగేకొద్దీ ఎక్కువగా ఉంటుంది. ముందుగా బుక్ చేసుకునే వారి కంటే సగటున, చివరి నిమిషంలో ప్రయాణికులు 15-20 శాతం ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు. అయినప్పటికీ, చివరి నిమిషంలో శీతాకాల సెలవుల కోసం ఇంకా చాలా మంది ఆసక్తి చూపుతుండటం గమనార్హం.
యూరోపియన్ గమ్యస్థానాలకు టిక్కెట్ ధరల భారీగా పెరుగుతున్నాయి. స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు స్థిరంగా జనాదరణ పొందడంతో యూరప్ పర్యటనను యూఏఈ ప్రయాణికులు అత్యధికంగా ఎంచుకుంటున్నారు. వింటర్ సీజన్లో యూరోపియన్ గమ్యస్థానాలకు టిక్కెట్ ధరలలో 10-12 శాతం పెరుగుదల నమోదైంది. అదే సమయంలో యూఏఈ నివాసితులు జార్జియా, కజాఖ్స్తాన్, కిర్గిజ్స్తాన్, అర్మేనియా వంటి స్ట్రీమ్లైన్డ్ వీసా ఉన్న దేశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే పొరుగున ఉన్న ఖతార్, ఒమన్, సౌదీ అరేబియా వంటి GCC దేశాలకు కూడా డిమాండ్ అధికంగా ఉందని నిపుణులు తెలిపారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







