అబుదాబిలో ప్రమాదాల నివారణకు అవగాహన ప్రచారం..!!
- December 18, 2024
యూఏఈ: ఇటీవల కాలంలో యూఏఈలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది. పోలీసులు, అధికారులు పదే పదే హెచ్చరించినప్పటికీ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల భయంకరమైన ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో అబుదాబి అధికారులు రోడ్డు ప్రమాదాల నివారించడానికి అవగాహన ప్రచారాన్ని ప్రారంభించారు.
అబుదాబి సెంటర్ ఫర్ లీగల్ అండ్ కమ్యూనిటీ అవేర్నెస్ (మసౌలియా) 'రోడ్డుపై మీ భద్రత మీ బాధ్యత' అనే డ్రైవ్ను ప్రారంభించింది. బాధ్యతారహితంగా డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, అతివేగంగా నడపడం, ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ ఏడాది ప్రారంభంలో షార్జాలోని ఎమిరేట్స్ రోడ్లో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిన కారు ప్రమాదంలో 24 ఏళ్ల నవ వధువు మరణించింది. అప్పటికి ఆమె వివాహమైన మూడు వారాలు మాత్రమే అవుతుంది
జైలు శిక్ష, భారీ జరిమానాలు
నిర్లక్ష్యపు డ్రైవింగ్కు సంబంధించిన చట్టపరమైన జరిమానాల గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు. యూఏఈ ఫెడరల్ ట్రాఫిక్ చట్టం ప్రకారం, ఉద్దేశపూర్వకంగా ఇతరుల ప్రాణాలకు మరియు భద్రతకు హాని కలిగించే ఎవరైనా జైలు శిక్ష, జరిమానాలను ఎదుర్కోవాలి. అటువంటి చర్యల వల్ల ఏదైనా నష్టం జరిగితే, జరిమానాలు మరింత తీవ్రంగా ఉంటాయి. ట్రాఫిక్ చట్టాలకు కట్టుబడి మరియు బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయడం కేవలం వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదు, సమాజ భద్రత కోసం సమిష్టి బాధ్యత అని మసౌలియా చెప్పారు. డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







