వైకుంఠ ఏకాదశి దర్శన, వసతి కోటా విడుదల తేదీలివే..
- December 21, 2024
తిరుమల: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10 నుంచి 19 వరకు పది రోజుల పాటు జరిగే వైకుంఠ వైకుంఠ ద్వార దర్శనాల కోసం డిసెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి టిక్కెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.
అలాగే పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను డిసెంబర్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో మార్చి నెల శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటా విడుదల తేదీలను మార్చారు. మార్చి నెలకు సంబంధించిన శ్రీవాణి టిక్కెట్ల కోటాను డిసెంబర్ 25న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
డిసెంబర్ 26వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటాను విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలోని డార్మెటరీ గదుల కోటాను విడుదల చేయనున్నారు.
ఈ మార్పును గమనించి, భక్తులు టిటిడి వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in లో మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్







