వైకుంఠ ఏకాదశి దర్శన, వసతి కోటా విడుదల తేదీలివే..

- December 21, 2024 , by Maagulf
వైకుంఠ ఏకాదశి దర్శన, వసతి కోటా విడుదల తేదీలివే..

తిరుమల: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10 నుంచి 19 వరకు పది రోజుల పాటు జరిగే వైకుంఠ వైకుంఠ ద్వార దర్శనాల కోసం డిసెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

అలాగే పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను డిసెంబర్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో మార్చి నెల శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటా విడుదల తేదీలను మార్చారు. మార్చి నెలకు సంబంధించిన శ్రీవాణి టిక్కెట్ల కోటాను డిసెంబర్ 25న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.

డిసెంబర్ 26వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటాను విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలోని డార్మెటరీ గదుల కోటాను విడుదల చేయనున్నారు.

ఈ మార్పును గమనించి, భక్తులు టిటిడి వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in లో మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకోవాల‌ని అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com