వైకుంఠ ఏకాదశి దర్శన, వసతి కోటా విడుదల తేదీలివే..
- December 21, 2024
తిరుమల: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10 నుంచి 19 వరకు పది రోజుల పాటు జరిగే వైకుంఠ వైకుంఠ ద్వార దర్శనాల కోసం డిసెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి టిక్కెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.
అలాగే పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను డిసెంబర్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో మార్చి నెల శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటా విడుదల తేదీలను మార్చారు. మార్చి నెలకు సంబంధించిన శ్రీవాణి టిక్కెట్ల కోటాను డిసెంబర్ 25న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
డిసెంబర్ 26వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటాను విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలోని డార్మెటరీ గదుల కోటాను విడుదల చేయనున్నారు.
ఈ మార్పును గమనించి, భక్తులు టిటిడి వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in లో మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









