‘అల్ మక్తూమ్ ఆర్కైవ్స్’ను ప్రకటించిన షేక్ మహమ్మద్..!!
- December 21, 2024
దుబాయ్: యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.. అల్ మక్తూమ్ ఆర్కైవ్స్ను స్థాపించారు. ఇది దుబాయ్ పాలకులు, అల్ మక్తూమ్ చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని డాక్యుమెంట్ చేసే బాధ్యతలను చేపట్టనుంది. అల్ మక్తూమ్ ఆర్కైవ్స్ ఏర్పాటుకు సంబంధించి షేక్ మహమ్మద్ 2024లో లా నంబర్ (28)ని జారీ చేశారు. ఈ చట్టం అల్ మక్తూమ్ ఆర్కైవ్స్ కార్పొరేషన్ అనే ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేసింది. అల్ మక్తూమ్ ఆర్కైవ్స్ దుబాయ్ పాలకులు, అల్ మక్తౌమ్ కుటుంబానికి చెందిన స్పష్టమైన సాంస్కృతిక వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి మరియు సంరక్షించనుంది.
దీంతోపాటు, ఆర్కైవ్స్ ప్రచురణలతోపాటు మీడియా ఛానెల్ల ద్వారా దుబాయ్ పాలకుల మేధో, మానవతా , సాంస్కృతిక వారసత్వాన్ని వ్యాప్తి చేస్తుంది. ఎమిరేట్ అభివృద్ధిక, యూఏఈని స్థాపించడంలో వారి పాత్రను హైలైట్ చేయనుంది.అల్ మక్తూమ్ కుటుంబం, ఎమిరేట్ చారిత్రక మైలురాళ్లపై పరిశోధన చేసి డాక్యుమెంట్ చేయనున్నారు. ఈ రికార్డులను భద్రపరచడానికి సమగ్ర డిజిటల్ ఆర్కైవ్ ఏర్పాటు చేయబడుతుంది.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









