‘అల్ మక్తూమ్ ఆర్కైవ్స్’ను ప్రకటించిన షేక్ మహమ్మద్..!!
- December 21, 2024
దుబాయ్: యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.. అల్ మక్తూమ్ ఆర్కైవ్స్ను స్థాపించారు. ఇది దుబాయ్ పాలకులు, అల్ మక్తూమ్ చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని డాక్యుమెంట్ చేసే బాధ్యతలను చేపట్టనుంది. అల్ మక్తూమ్ ఆర్కైవ్స్ ఏర్పాటుకు సంబంధించి షేక్ మహమ్మద్ 2024లో లా నంబర్ (28)ని జారీ చేశారు. ఈ చట్టం అల్ మక్తూమ్ ఆర్కైవ్స్ కార్పొరేషన్ అనే ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేసింది. అల్ మక్తూమ్ ఆర్కైవ్స్ దుబాయ్ పాలకులు, అల్ మక్తౌమ్ కుటుంబానికి చెందిన స్పష్టమైన సాంస్కృతిక వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి మరియు సంరక్షించనుంది.
దీంతోపాటు, ఆర్కైవ్స్ ప్రచురణలతోపాటు మీడియా ఛానెల్ల ద్వారా దుబాయ్ పాలకుల మేధో, మానవతా , సాంస్కృతిక వారసత్వాన్ని వ్యాప్తి చేస్తుంది. ఎమిరేట్ అభివృద్ధిక, యూఏఈని స్థాపించడంలో వారి పాత్రను హైలైట్ చేయనుంది.అల్ మక్తూమ్ కుటుంబం, ఎమిరేట్ చారిత్రక మైలురాళ్లపై పరిశోధన చేసి డాక్యుమెంట్ చేయనున్నారు. ఈ రికార్డులను భద్రపరచడానికి సమగ్ర డిజిటల్ ఆర్కైవ్ ఏర్పాటు చేయబడుతుంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







