యూఏఈలో కిండర్ గార్టెన్ నుండి గ్రేడ్ 12 విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు..!!
- December 21, 2024
యూఏఈ: యూఏఈ విద్యార్థులకు వార్షిక పాఠశాల ఆరోగ్య పరీక్షలను నిర్వహించనున్నారు. ఎమిరేట్ వ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ మార్గదర్శకాలను విడుదల చేశారు. నేషనల్ స్కూల్ హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలను ప్రారంభించింది. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ ప్రయత్నాలను ముమ్మరం చేసేందుకు, వారిలో ఆరోగ్య సమస్యలను గుర్తించేందుకు ఇది దోహదం చేస్తుందని అధికారులు తెలిపారు.
ఆరోగ్య, నివారణ మంత్రిత్వ శాఖ (మొహాప్) ఆధ్వర్యంలో కిండర్ గార్టెన్ నుండి గ్రేడ్ 12 వరకు చదివే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా దృష్టి, వినికిడి, దంత ఆరోగ్య పరీక్షలతోపాటు మానసిక, ప్రవర్తనా సమస్యలపైనా ఫోకస్ పెట్టనున్నారు. అదే విధంగా 10 ఏళ్లు పైబడిన విద్యార్థుల్లో ధూమపాన అలవాట్లపై పర్యవేక్షణ పరీక్షలను కూడా నిర్వహిస్తారు. వివిధ వయస్సు స్థాయిలలోని విద్యార్థులకు అనుగుణంగా వైద్య పరీక్షలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇది భవిష్యత్తు తరాలను సరైన ఆరోగ్యం, సంసిద్ధతతో సిద్ధం చేయడంతోపాటు స్థిరమైన భవిష్యత్తును నిర్మించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పబ్లిక్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ డాక్టర్ హుస్సేన్ అబ్దుల్ రహ్మాన్ అల్ రాండ్ అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







