మహిళపై వేధింపులు.. నిందితులకు జైలుశిక్ష, జరిమానా..!!
- December 23, 2024
మనామా: ఓ రెస్టారెంట్ లో పని పేరుతో వేధింపులకు పాల్పడుతున్న నిందితుల భారి నుండి తప్పించుకున్న ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులైన వ్యాపారవేత్త, ఒక ఆసియా సూపర్వైజర్ ను అరెస్ట్ చేసింది. కోర్టు వీరికి ఒక్కొక్కరికి మూడు సంవత్సరాల జైలు శిక్ష, BD2,000 జరిమానా విధించింది. బాధితురాలు తిరిగి స్వదేశం వెళ్లడానికి అవసరమైన మొత్తాన్ని కూడా నిందితులు చెల్లించాలని కోర్టు తన తీర్పులో వెల్లడించింది. జైలుశిక్షలు పూర్తయిన తర్వాత వారిని బహిష్కరిస్తారు. ఉపాధి హామీతో పర్యాటక వీసాపై బహ్రెయిన్కు తీసుకువచ్చినట్లు బాధితురాలు నివేదించింది. అనంతరం ఆమెను చట్టవిరుద్ధమైన పరిస్థితులలో.. రెస్టారెంట్లో పని చేయించారని పేర్కొంది. పనిచేసేందుకు నిరాకరించగా, బెదిరింపులు, శారీరక వేధింపులకు గురిచేశారు. ఈ కేసును విచారిస్తున్న ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ.. నిందితులు ప్రత్యేకంగా ఆసియా మహిళలను లక్ష్యంగా చేసుకున్నారని, తప్పుడు హామీలతో వారిని బహ్రెయిన్కు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









