మహిళపై వేధింపులు.. నిందితులకు జైలుశిక్ష, జరిమానా..!!
- December 23, 2024
మనామా: ఓ రెస్టారెంట్ లో పని పేరుతో వేధింపులకు పాల్పడుతున్న నిందితుల భారి నుండి తప్పించుకున్న ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులైన వ్యాపారవేత్త, ఒక ఆసియా సూపర్వైజర్ ను అరెస్ట్ చేసింది. కోర్టు వీరికి ఒక్కొక్కరికి మూడు సంవత్సరాల జైలు శిక్ష, BD2,000 జరిమానా విధించింది. బాధితురాలు తిరిగి స్వదేశం వెళ్లడానికి అవసరమైన మొత్తాన్ని కూడా నిందితులు చెల్లించాలని కోర్టు తన తీర్పులో వెల్లడించింది. జైలుశిక్షలు పూర్తయిన తర్వాత వారిని బహిష్కరిస్తారు. ఉపాధి హామీతో పర్యాటక వీసాపై బహ్రెయిన్కు తీసుకువచ్చినట్లు బాధితురాలు నివేదించింది. అనంతరం ఆమెను చట్టవిరుద్ధమైన పరిస్థితులలో.. రెస్టారెంట్లో పని చేయించారని పేర్కొంది. పనిచేసేందుకు నిరాకరించగా, బెదిరింపులు, శారీరక వేధింపులకు గురిచేశారు. ఈ కేసును విచారిస్తున్న ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ.. నిందితులు ప్రత్యేకంగా ఆసియా మహిళలను లక్ష్యంగా చేసుకున్నారని, తప్పుడు హామీలతో వారిని బహ్రెయిన్కు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









