మహిళపై వేధింపులు.. నిందితులకు జైలుశిక్ష, జరిమానా..!!
- December 23, 2024
మనామా: ఓ రెస్టారెంట్ లో పని పేరుతో వేధింపులకు పాల్పడుతున్న నిందితుల భారి నుండి తప్పించుకున్న ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులైన వ్యాపారవేత్త, ఒక ఆసియా సూపర్వైజర్ ను అరెస్ట్ చేసింది. కోర్టు వీరికి ఒక్కొక్కరికి మూడు సంవత్సరాల జైలు శిక్ష, BD2,000 జరిమానా విధించింది. బాధితురాలు తిరిగి స్వదేశం వెళ్లడానికి అవసరమైన మొత్తాన్ని కూడా నిందితులు చెల్లించాలని కోర్టు తన తీర్పులో వెల్లడించింది. జైలుశిక్షలు పూర్తయిన తర్వాత వారిని బహిష్కరిస్తారు. ఉపాధి హామీతో పర్యాటక వీసాపై బహ్రెయిన్కు తీసుకువచ్చినట్లు బాధితురాలు నివేదించింది. అనంతరం ఆమెను చట్టవిరుద్ధమైన పరిస్థితులలో.. రెస్టారెంట్లో పని చేయించారని పేర్కొంది. పనిచేసేందుకు నిరాకరించగా, బెదిరింపులు, శారీరక వేధింపులకు గురిచేశారు. ఈ కేసును విచారిస్తున్న ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ.. నిందితులు ప్రత్యేకంగా ఆసియా మహిళలను లక్ష్యంగా చేసుకున్నారని, తప్పుడు హామీలతో వారిని బహ్రెయిన్కు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







